E-Paper
Advertisement

Guntur: కన్నబిడ్డ కోసం దివ్యాంగుడి కన్నీటి పోరాటం.. ఏడాది దాటినా దొరకని ఆచూకీ!

Guntur: కన్నబిడ్డ కోసం దివ్యాంగుడి కన్నీటి పోరాటం.. ఏడాది దాటినా దొరకని ఆచూకీ!
Advertisement

Guntur: పాపం.. కూతురి జాడ కోసం ఏడాది నుంచి తండ్రి వేతుకులాట.. గుంటూరు జిల్లా ఆర్. అగ్రహారానికి చెందిన ఏసోబు అనే దివ్యాంగుడు తన 15 ఏళ్ల కుమార్తె ఆచూకీ కోసం ఏడాది కాలంగా అలుపెరగని పోరాటం చేస్తున్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో బాలిక ఇంటి నుండి వెళ్లిపోవడంతో, తండ్రి వెంటనే పోలీసులను ఆశ్రయించారు. అయితే, కన్నబిడ్డ కనిపించడం లేదని ఆవేదనతో ఉన్న తండ్రికి అండగా నిలవాల్సిన పోలీసులు, విచారణ పేరుతో కాలయాపన చేయడమే కాకుండా, పదేపదే స్టేషన్‌కు రావద్దంటూ ఆయనపై అసహనం వ్యక్తం చేశారు.

ఆశాజనకంగా మారిన ఫోన్ కాల్.. ఆపై ఆందోళన
తమ కుమార్తె మిస్సయిన నాలుగు నెలల తర్వాత ఏసోబుకు ఆమె నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. తాను సికింద్రాబాద్‌లో ఉన్నానని ఆ బాలిక తండ్రికి చెప్పింది. అయితే, పూర్తి వివరాలు తెలుసుకునేలోపే గుర్తుతెలియని వ్యక్తులు ఆమె నుంచి ఫోన్ లాక్కుని కాల్ కట్ చేశారు. ఆ తర్వాత కొద్దిరోజులకే అదే నంబరు నుండి ఒక యువకుడు ఫోన్ చేసి, “మీ అమ్మాయి చనిపోయింది” అని చెప్పి ఫోన్ స్విచ్ఛాప్ చేయడం ఈ కేసులో తీవ్ర భయాందోళనలను కలిగించింది. ఈ కీలక సమాచారాన్ని, ఫోన్ నంబర్‌ను వెంటనే పోలీసులకు అందించినా, వారు సకాలంలో స్పందించలేదని బాధితుడు ఆరోపిస్తున్నారు.

Advertisement

పోలీసుల నిర్లక్ష్యంపై బాధితుడి ఆవేదన
తన కుమార్తె ఫోన్ చేసినప్పుడే పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని (Tower location) ఉపయోగించి ఉంటే ఆమెను కాపాడుకునే అవకాశం ఉండేదని ఏసోబు కన్నీటి పర్యంతమయ్యారు. ఒక దివ్యాంగుడన్న కనికరం కూడా లేకుండా పోలీసులు తనను స్టేషన్ చుట్టూ తిప్పించుకున్నారని, తన కుమార్తె బతికే ఉందా లేదా అన్న కనీస సమాచారం కూడా ఇవ్వలేకపోయారని ఆయన వాపోయారు. ఉన్నతాధికారులైనా స్పందించి తనకు న్యాయం చేయాలని సోమవారం జరిగిన గ్రీవెన్స్ సెల్‌లో అధికారులను వేడుకున్నారు.

డీఎస్పీ ఆదేశాలు – విచారణలో వేగం
బాధితుడి గోడును విన్న డీఎస్పీ అరవింద్ ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. ఒక మైనర్ బాలిక అదృశ్యం కేసులో ఇంత జాప్యం జరగడం, పైగా చనిపోయిందన్న బెదిరింపు కాల్స్ వచ్చినా నిర్లక్ష్యం వహించడంపై ఆయన విచారణకు ఆదేశించారు. తక్షణమే ఆ ఫోన్ నంబర్ ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేయాలని, బాలిక ఆచూకీని కనిపెట్టి తండ్రికి న్యాయం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Advertisement

Also Read: అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం.. భార్యాభర్తల గొడవ, బలైపోయిన నాలుగేళ్ల బాలుడు

ప్రస్తుతం ఈ కేసు పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆ బాలికను ఎవరు తీసుకువెళ్లారు? సికింద్రాబాద్‌లో ఆమెను బంధించిన వారు ఎవరు? ఆ ఫోన్ చేసిన యువకుడికి బాలిక మరణం గురించి ఎలా తెలుసు? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టాల్సి ఉంది. ఒక తండ్రి పడుతున్న వేదనకు ముగింపు పలకాల్సిన బాధ్యత ఇప్పుడు పోలీసు యంత్రాంగంపై ఉంది.

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×