E-Paper
Advertisement

Guntur : ఇప్పటంలో వైఎస్ విగ్రహం తొలగింపు..

Guntur : ఇప్పటంలో వైఎస్ విగ్రహం తొలగింపు..
Advertisement

Guntur : గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామం ఏపీ రాజకీయాలకు కేంద్రబిందువైంది. జనసేన సభకు స్థలం ఇచ్చారన్న అక్కసుతో వైసీపీ ప్రభుత్వం అక్రమంగా ఇళ్లు కూల్చారంటూ ఆపార్టీ అధినేత పవన్ కల్యాణ్ శనివారం బాధితులను పరామర్శించిన విషయం విధితమే.

అయితే రహదారిపై ఉన్న విగ్రహాలు అడ్డురాలేదు కానీ పేదల ఇళ్ళే అడ్డొచ్చాయా? వాటిని ఎందుకు కూల్చలేదని పవన్ కల్యాణ్ ఈసందర్భంగా ప్రభుత్వాన్ని నిలదీశారు. దీనిపై సోషల్ మీడియాలోనూ పెద్దఎత్తున దుమారం చెలరేగింది. పవన్ కామెంట్స్‌కు స్పందించిన వైసీపీ సర్కారు సోమవారం ఆ విగ్రహాల తొలగింపునకు రంగంలోకి దిగింది. భారీ క్రేన్లను ఇప్పటం గ్రామానికి రప్పించి దివంగత నేత వైఎస్ విగ్రహంతోపాటు గాంధీజీ, నెహ్రూ విగ్రహాలను కూడా తొలగించింది.

Advertisement

ఇప్పటం గ్రామానికి వెళ్లే ఆర్ అండ్ బీ రహదారి 80 అడుగుల వెడల్పు ఉండాల్సిందిపోయి ఆక్రమణల కారణంగా 40-50 అడుగులకే కుదించుకు పోయిందని మున్సిపల్ అధికారులు పేర్కొన్నారు. చట్టప్రకారం నోటీసులు జారీ చేసి బుధ,గురువారాల్లో ఆక్రమణలు తొలగించినట్టు చెప్పారు. 53 ఆక్రమణలను తాము గుర్తించగా ,జనసేనకు చెందిన ఒకరు మాత్రమే హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారని వారు వెల్లడించారు. మిగిలిన వాటిని మాత్రమే తాము తొలగించామని, ఇళ్లు కూల్చలేదని తెలిపారు. రహదారిని ఆక్రమిస్తున్న గోడలను, దుకాణాలను మాత్రమే తొలగించామని వారు తెలిపారు.

Tags

Related News

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Big Stories

Advertisement
×