E-Paper
Advertisement

Guntur : ఇప్పటంలో వైఎస్ విగ్రహం తొలగింపు..

Guntur : ఇప్పటంలో వైఎస్ విగ్రహం తొలగింపు..

Guntur : గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామం ఏపీ రాజకీయాలకు కేంద్రబిందువైంది. జనసేన సభకు స్థలం ఇచ్చారన్న అక్కసుతో వైసీపీ ప్రభుత్వం అక్రమంగా ఇళ్లు కూల్చారంటూ ఆపార్టీ అధినేత పవన్ కల్యాణ్ శనివారం బాధితులను పరామర్శించిన విషయం విధితమే.

అయితే రహదారిపై ఉన్న విగ్రహాలు అడ్డురాలేదు కానీ పేదల ఇళ్ళే అడ్డొచ్చాయా? వాటిని ఎందుకు కూల్చలేదని పవన్ కల్యాణ్ ఈసందర్భంగా ప్రభుత్వాన్ని నిలదీశారు. దీనిపై సోషల్ మీడియాలోనూ పెద్దఎత్తున దుమారం చెలరేగింది. పవన్ కామెంట్స్‌కు స్పందించిన వైసీపీ సర్కారు సోమవారం ఆ విగ్రహాల తొలగింపునకు రంగంలోకి దిగింది. భారీ క్రేన్లను ఇప్పటం గ్రామానికి రప్పించి దివంగత నేత వైఎస్ విగ్రహంతోపాటు గాంధీజీ, నెహ్రూ విగ్రహాలను కూడా తొలగించింది.

ఇప్పటం గ్రామానికి వెళ్లే ఆర్ అండ్ బీ రహదారి 80 అడుగుల వెడల్పు ఉండాల్సిందిపోయి ఆక్రమణల కారణంగా 40-50 అడుగులకే కుదించుకు పోయిందని మున్సిపల్ అధికారులు పేర్కొన్నారు. చట్టప్రకారం నోటీసులు జారీ చేసి బుధ,గురువారాల్లో ఆక్రమణలు తొలగించినట్టు చెప్పారు. 53 ఆక్రమణలను తాము గుర్తించగా ,జనసేనకు చెందిన ఒకరు మాత్రమే హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారని వారు వెల్లడించారు. మిగిలిన వాటిని మాత్రమే తాము తొలగించామని, ఇళ్లు కూల్చలేదని తెలిపారు. రహదారిని ఆక్రమిస్తున్న గోడలను, దుకాణాలను మాత్రమే తొలగించామని వారు తెలిపారు.

Tags

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×