TATA Nagar Smuggling : ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 28 పాములు. 12 ఊసరవెల్లులు, 9 పెట్టెల కీటకాలు, ఒక పెట్టెలో స్పైడర్స్.. ఇదేదో.. జూ.. గురించి చెబుతున్నది కాదు. వీటిని అక్రమంగా రవాణా చేస్తూ దేవిచంద్ర అనే మహిళా ఆర్పీఎఫ్ పోలీసులకు చిక్కింది.
జంషెడ్ పూర్ లోని టాటానగర్ రైల్వే స్టేషన్ లో సదరు మహిళ బ్యాగ్ ను పోలీసులు తనిఖీ చేశారు. అందులో ఉన్న వాటిని చూసి ఒక్కసారిగా కంగుతిన్నారు. పాములు, కీటకాలు, ఊసరవెల్లులను స్మగ్లింగ్ చేస్తున్నట్టు గుర్తించి ఆమెను స్టేషన్ కు తరలించారు. ఓ మహిళ బ్యాగ్ ను ఓపెన్ చేయడంతో అందులోంచి పాములు, పలురకాల కీటకాలు బయటపడ్డాయి.
వెంటనే పోలీసులు స్నేక్ క్యాచర్స్ కు సమాచారం అందించారు. వాళ్లు వచ్చి బ్యాగులోని మిగతావాటిని చూసేసరికి అందులోని 8 ఊసరవెల్లులు, ఒక పాము చనిపోయి ఉంది. సదరు మహిళపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఆమె స్వస్థలం పుణె అని పోలీసులు తెలిపారు. నీలాంచల్ ఎక్స్ ప్రెస్ జనరల్ బోగీ ఆ మహిళ ప్రయాణించిందంటున్నారు