E-Paper
Advertisement

Vyuham Movie Release : హైకోర్టులో విచారణ వాయిదా.. వ్యూహం రిలీజ్ పై ఉత్కంఠ..

Vyuham Movie Release : హైకోర్టులో విచారణ వాయిదా.. వ్యూహం రిలీజ్ పై ఉత్కంఠ..

Vyuham Movie Release : ఏపీ రాజకీయాలపై రాంగోపాల్‌ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘వ్యూహం’. ఈ మూవీ రిలీజ్ పై ఉత్కంఠ నెలకొంది. ఈ సినిమాకు ఇచ్చిన సెన్సార్‌ సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని కోరుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ న్యాయపోరాటం చేస్తున్నారు. ఆయన వేసిన పిటిషన్‌పై విచారణను తెలంగాణ హైకోర్టు వాయిదా వేయడంతో వ్యూహం రిలీజ్ పై సందిగ్ధత ఏర్పడింది.

‘వ్యూహం’ సినిమాకు ఇచ్చిన సెన్సార్‌ సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని కోరుతూ నారా లోకేశ్‌ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. మూవీ రిలీజ్ చేయకుండా చిత్ర నిర్మాతను ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్ విచారణను ఉన్నత న్యాయస్థానం డిసెంబర్‌ 28కి వాయిదా వేసింది.

‘వ్యూహం’ ట్రైలర్‌ రిలీజ్ సమయంలో దర్శకుడు తనకు జగన్‌ అంటే ఇష్టమని చెప్పారని లోకేష్ పిటిషన్ లో ప్రస్తావించారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ నచ్చరని వర్మ చెప్పారని పేర్కొన్నారు. ఏపీ సీఎం జగన్ వ్యూహం మూవీని తెరవెనక ఉండి తీయించారని ఆరోపించారు.

సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ ప్రాంతీయ కార్యాలయం, రివైజింగ్‌ కమిటీ, రామదూత క్రియేషన్స్‌, ప్రొడ్యూసర్ దాసరి కిరణ్‌ కుమార్‌, డైరెక్టర్ రామ్‌గోపాల్‌ వర్మను పిటిషన్‌లో ప్రతివాదులుగా చేర్చారు. వ్యూహం డిసెంబర్‌ 29న రిలీజ్ కావాల్సి ఉంది. ఈనేపథ్యంలో డిసెంబర్ 28 హైకోర్టు ఇచ్చే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.

Tags

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×