BigTV English
Advertisement

High Temperatures in Telugu States: హెచ్చరిక.. ఈ సమయంలో బయటకు రాకండి.. తెలుగు రాష్ట్ర ప్రజలకు IMD వార్నింగ్!

High Temperatures in Telugu States: హెచ్చరిక.. ఈ సమయంలో బయటకు రాకండి.. తెలుగు రాష్ట్ర ప్రజలకు IMD వార్నింగ్!


Heavy Temperatures Alert : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 గంటలు దాటితే.. రోడ్లు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. విపరీతమైన ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. వడదెబ్బతాకి ఇప్పటికే కొన్నిప్రాంతాల్లో వృద్ధులు మృతి చెందారు. ఇక నేడు, రేపు ఇరు రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరగడంతో పాటు.. వడగాలులు కూడా వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది.

గురువారం తెలంగాణలోని నల్గొండ జిల్లా నిడమనూరులో అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇటు ఏపీలోనూ 44 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏపీలో నంద్యాలజిల్లా యాగలబకంకిలో 44.1 డిగ్రీలు, కడప జిల్లా చిన్న చెప్పల్లిలో 43.9 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైంది. ముఖ్యంగా రాయలసీమలో ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. శుక్ర, శనివారాల్లో రాయలసీమతో పాటు కోస్తాంధ్రలోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.


Also Read: వైసీపీ డీఎన్ఏలోనే శవరాజకీయం.. కొవ్వూరు ప్రజాగళంలో చంద్రబాబు..

వైఎస్సార్ కడప, కర్నూల్, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో 41 నుంచి 43 డిగ్రీల వరకూ, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల్లో 44 డిగ్రీల వరకూ.. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా, తూర్పు గోదావరి జిల్లాలో 45 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని, అత్యవసరమైతే తప్ప ఈ సమయంలో బయటకు రావొద్దని తెలిపింది.

Tags

Related News

Tirupati Laddu Controversy: తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సిట్ దూకుడు.. కీలక నిందితుడు అరెస్ట్

AP Investments: ఏపీకి భారీగా తరలివస్తున్న పెట్టుబడులు.. లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం..

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Big Stories

×