E-Paper
Advertisement

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

AP Govt Three Wheelers Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగులకు గుడ్ న్యూస్ చెప్పింది. అర్హులైన దివ్యాంగులకు 100% సబ్సిడీతో మూడు చక్రాల మోటార్ సైకిళ్లు(రెట్రోఫిట్టేడ్ మోటరైజ్డ్ వాహనాలు) మంజూరు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆన్లైన్ లో దరఖాస్తులను ఆహ్వానింది. అర్హులైన వారు https://apdascac.ap.gov.in/ వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హతలు:

25.11.2025 నాటికి 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.

ఒకటి లేదా రెండు లోయర్ లింబ్స్ 70% లేదా అంతకంటే ఎక్కువ శాతం దివ్యాంగులై ఉండాలి.

కుటుంబ వార్షిక ఆదాయం రూ.3,00,000/- కంటే ఎక్కువ ఉండకూడదు.

అభ్యర్థి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి.

వాహనం నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.

ప్రభుత్వం లేదా ప్రైవేట్ సంస్థల ద్వారా ఇంతకు ముందు ఏ మోటరైజ్డ్ వాహనాన్ని పొంది ఉండకూడదు లేదా తన పేరుపై ఎలాంటి వాహనం ఉండకూడదు.

అర్హులైన వర్గాలు:

1. గ్రాడ్యుయేషన్ లేదా అంతకంటే పై స్థాయి కోర్సులు రెగ్యులర్ పద్ధతిలో చదువుతున్న విద్యార్థులు అర్హులు

2. స్వయం ఉపాధి, వ్యవసాయ అనుబంధ రంగాలు లేదా కనీసం ఒక సంవత్సరం అనుభవంతో వేతన ఉద్యోగులు (కనీసం 10వ తరగతి విద్యార్హత ఉండాలి).

అర్హులైన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ దివ్యాంగులు & వృద్ధుల సహాయ సంస్థ (APDASCAC) అధికారిక వెబ్ సైట్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయవచ్చు. ఈ దరఖాస్తులను జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో తనిఖీ చేస్తారు.

Also Read:  ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు

1. వికలాంగుల ధ్రువపత్రం (SADAREM / జిల్లా వైద్య బోర్డు)

2. ఆధార్ కార్డు

3. SSC సర్టిఫికేట్

4. కుల ధ్రువపత్రం (SC, ST, BC అభ్యర్థులకు)

5. లెటెస్ట్ ఆదాయ ధృవపత్రం

6. బోనాఫైడ్ సర్టిఫికేట్ (విద్యార్థుల కోసం) / ఉపాధి ధ్రువపత్రం (స్వయం ఉపాధి లేదా ఉద్యోగుల కోసం)

7. పాస్ పోర్ట్ సైజు ఫోటో

8. ఇంతకు ముందు వాహనం పొందలేదని స్వీయ ధ్రువీకరణ

ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: నవంబర్ 25, 2025

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×