E-Paper
Advertisement

YS Viveka Murder Case: మూసుకుపోయిన దారులు.. అవినాష్‌కి మరో పది రోజులేనా..?

YS Viveka Murder Case: మూసుకుపోయిన దారులు.. అవినాష్‌కి మరో పది రోజులేనా..?
CBI request highcourt to cancel Avinashreddy bail on ys viveka murder case
CBI request high court to cancel Avinashreddy bail on ys viveka murder case

CBI Request High Court to Cancel Avinash Reddy Bail on YS Viveka Murder Case: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో న్యూ ట్విస్ట్. ఈ కేసులో మాజీ ఎంపీ అవినాష్‌రెడ్డికి కష్టాలు తప్పవా? దాదాపుగా ఆయన ఇరుకున్నట్టేనా? ఇన్నాళ్లు అరెస్టు నుంచి తప్పించు కున్న ఆయన.. ఇక జైలుకి వెళ్లడం ఖాయమేనా? అవుననే సంకేతాలు బలంగా వినివిపిస్తున్నాయి. అంతేకాదు ఆయన బెయిల్ రద్దు చేయాలని న్యాయస్థానాన్ని సీబీఐ కోరడం జరిగిపోయింది. మరో పది రోజుల్లో ఈ కేసు ఫైనల్ స్టేజ్‌కి రావచ్చని చెబుతున్నారు.

అసలు తెలంగాణ హైకోర్టులో ఏం జరిగింది? నిందితుడు అవినాష్‌రెడ్డి చుట్టూ ఎందుకు ఉచ్చు బిగుసు కుంటోంది? ఈ కేసులో అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ మరో నిందితుడు దస్తగిరి తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ కేసులో నిందితుడు అవినాష్‌రెడ్డి బెయిల్ షరతులను ఉల్లంఘించారన్నది ప్రధానంగా ప్రస్తావించారు.

దీనిపై న్యాయమూర్తి జోక్యం చేసుకుని సీబీఐ నిర్ణయమేంటని ప్రశ్నించారు. దస్తగిరి వాదనను సమర్ధిస్తున్నామని తెలిపింది సీబీఐ. అవినాష్ బెయిల్ రద్దు చేయాలని మీరెందుకు న్యాయస్థానాన్ని కోరలేదని ప్రశ్నించింది. అనుమతులు రావడానికి కొంత సమయం పడుతుందని, వివేకానంద కూతురు ఎస్ఎల్పీ దాఖలు చేశారని, అందులోనే అవినాష్ బెయిల్ రద్దు చేయాలని తాము కౌంటర్ దాఖలు చేశామని గుర్తు చేశారు సీబీఐ న్యాయవాది.

దస్తగిరి అప్రూవల్‌గా మారడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటీషన్‌తో దీనికి సంబంధం లేదని కోర్టు తెలిపింది. ఇరువర్గాల వాదనలను విన్న న్యాయమూర్తి ఈనెల 15కి వాయిదా వేశారు. నిందితులు వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలు దాఖలు చేసిన బెయిల్ పిటీషన్లపై విచారణను ఈనెల ఎనిమిదికి వాయిదా వేసింది.

Also Read: వైసీపీకి షాక్.. ఆమంచి రాజీనామా..

కేసు ఇంకా లోతుల్లోకి వెళ్తే.. అవినాష్ రెడ్డి అనుచరులు దస్తగిరి తండ్రిపై దాడి చేశారని ఆయన తరపు న్యాయవాదులు వాదించారు. తమకు అనుకూలంగా సాక్ష్యం చెప్పుకుంటే దస్తగిరి ఫ్యామిలీకి ఇబ్బందులు తప్పవని వార్నింగ్ ఇచ్చారని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని వివరించారు. ఈ కేసులో అవినాష్ రెడ్డి నిందితుడిగా ఉన్నారా లేరా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. దీనికి అవినాష్ తరపు లాయర్ లేదని రిప్లై ఇచ్చారు. తమకు అనుకూలంగా సాక్ష్యం చెబితే 20 కోట్లు ఇస్తామని నిందితులు శివశంకర్‌రెడ్డి, ఆయన కొడుకు చైతన్యరెడ్డి కలిసి దస్తగిరి ఆఫర్ ఇచ్చారని అడ్వకేట్ వాదించారు. అంతేకాదు దస్తగిరి కుటుంబానికి ఉద్యోగంతోపాటు ఫ్యామిలీ సమస్యలను చూసుకుంటామని లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారని గుర్తుచేశారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి కేసులో ఈనెల 15కి వాయిదా వేశారు.

Tags

Related News

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

Big Stories

×