E-Paper
Advertisement

Godavari : అనుమానం పెనుభూతమై.. భార్య హత్య..

Godavari : అనుమానం పెనుభూతమై.. భార్య హత్య..
Advertisement

Godavari : అనుమానంతో భార్యను హత మార్చాడో భర్త. ఈ దారుణం గోదావరి జిల్లా భీమవరంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భీమవరంకి చెందిన తాతపూడి సూర్యనారాయణ అనే వ్యక్తికి ఎన్టీఆర్‌ కాలనీకి చెందిన రామలక్ష్మి అనే యువతితో 2017 మే 24 న వివహం జరిగింది. ఆ దంపతులకు నాలుగేళ్ల హేమాన్ష్ అనే బాబు ఉన్నాడు.

చక్కని కాపురంలో అనుమానం అనే భూతం వచ్చి వారి మధ్య చిచ్చు పెట్టింది. ఏడాది నుంచి అనుమానంతో సూర్యనారాయణ భార్య రామలక్ష్మిని వేధిస్తుండటంతో.. తట్టుకోలేక పుట్టింటికి వెళ్ళింది. తన తల్లిదండ్రులు సర్ది చెప్పి రామలక్ష్మిని తిరిగి మళ్లీ కాపురానికి పంపిచేవారు. అయినా భర్త ప్రవర్తన మారకపోవడంతో రామలక్ష్మి పోలీసు స్టేషన్ లో భర్తపై కేసు నమోదు చేసి పుట్టింటికి వచ్చింది.

Advertisement

ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి.. సూర్యనారాయణ రామలక్ష్మిపై దాడి చేసి 12 సార్లు కత్తితో పొడిచాడు. అడ్డు వచ్చిన రామలక్ష్మి తండ్రి పై కూడా సూర్యనారాయణ దాడి చేసి కలుపు నివారణ మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు 108కి ఫోన్ చేసి క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 12 కత్తి పోట్లు దిగడంతో రామలక్ష్మి మరణించింది. చికిత్స పోందుతూ సూర్యనారాయణ కూడా మరణించాడు. భార్యపై అనుమానంతో చక్కని కుటుంబాన్ని చేతులారా నాశనం చేసుకుని నాలుగేళ్ల బాబుని అనాథను చేశారు. ఈ రెండు ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.

Related News

నెల్లూరులో చెత్త నిధులపై మాటల యుద్ధం.. సవాల్ విసిరిన వైసీపీ.. తిప్పికొట్టిన కూటమి!

పల్నాడులో విషాదం.. బైక్‌ను ఢీకొన్న ట్రావెల్ బస్సు, ఇద్దరి మృతి!

చిటికెలో సమస్యలు పరిష్కారం, శ్రీవారి భక్తులకు తోడుగా ‘నందకం’

శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. సోమవారం నుంచి సర్వ దర్శనం టోకెన్లు నిలిపివేత

మూడురోజులుగా కుమ్మేస్తున్న వర్షాలు.. ఉప్పొంగుతున్న జలపాతాలు, పర్యాటకులకు నో ఎంట్రీ

అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో కుమ్మేస్తున్న వర్షాలు, తెల్లవారుజామున హైదరాబాద్‌లో భారీ వర్షం

పల్నాడులో పిడుగు పడి నలుగురు మృతి.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు

నంద్యాలలో విద్యుత్ JE మిస్సింగ్ కలకలం.. తిరుపతి వెళ్తున్నానని చెప్పి ఎక్కడికెళ్లారు?

Big Stories

Advertisement
×