BigTV English

Godavari : అనుమానం పెనుభూతమై.. భార్య హత్య..

Godavari : అనుమానం పెనుభూతమై.. భార్య హత్య..

Godavari : అనుమానంతో భార్యను హత మార్చాడో భర్త. ఈ దారుణం గోదావరి జిల్లా భీమవరంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భీమవరంకి చెందిన తాతపూడి సూర్యనారాయణ అనే వ్యక్తికి ఎన్టీఆర్‌ కాలనీకి చెందిన రామలక్ష్మి అనే యువతితో 2017 మే 24 న వివహం జరిగింది. ఆ దంపతులకు నాలుగేళ్ల హేమాన్ష్ అనే బాబు ఉన్నాడు.


చక్కని కాపురంలో అనుమానం అనే భూతం వచ్చి వారి మధ్య చిచ్చు పెట్టింది. ఏడాది నుంచి అనుమానంతో సూర్యనారాయణ భార్య రామలక్ష్మిని వేధిస్తుండటంతో.. తట్టుకోలేక పుట్టింటికి వెళ్ళింది. తన తల్లిదండ్రులు సర్ది చెప్పి రామలక్ష్మిని తిరిగి మళ్లీ కాపురానికి పంపిచేవారు. అయినా భర్త ప్రవర్తన మారకపోవడంతో రామలక్ష్మి పోలీసు స్టేషన్ లో భర్తపై కేసు నమోదు చేసి పుట్టింటికి వచ్చింది.

ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి.. సూర్యనారాయణ రామలక్ష్మిపై దాడి చేసి 12 సార్లు కత్తితో పొడిచాడు. అడ్డు వచ్చిన రామలక్ష్మి తండ్రి పై కూడా సూర్యనారాయణ దాడి చేసి కలుపు నివారణ మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు 108కి ఫోన్ చేసి క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 12 కత్తి పోట్లు దిగడంతో రామలక్ష్మి మరణించింది. చికిత్స పోందుతూ సూర్యనారాయణ కూడా మరణించాడు. భార్యపై అనుమానంతో చక్కని కుటుంబాన్ని చేతులారా నాశనం చేసుకుని నాలుగేళ్ల బాబుని అనాథను చేశారు. ఈ రెండు ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.


Related News

Power Bills: గుడ్ న్యూస్ చెప్పిన సీఎం.. నవంబర్ నుంచి విద్యుత్ ఛార్జీలు తగ్గింపు

Kadapa District: తాళి కట్టగానే వరుడికి మూడు కొరడా దెబ్బలు.. ఈ వింత ఆచారం ఎక్కడో తెలుసా?

Tirupati Ragging: తిరుపతి ర్యాగింగ్ ఘటనపై మంత్రి లోకేశ్ సీరియస్.. దర్యాప్తునకు ఆదేశం

Uppada Fishermen Issue: ఉప్పాడ మత్స్యకారుల సమస్యపై డిప్యూటీ సీఎం రంగంలోకి.. ఏం చేశారంటే?

Home Minister Anitha: అనకాపల్లిలో ఉద్రిక్తత.. అనిత కాన్వాయ్ పైకి.. దూసుకెళ్లిన మత్స్యకారులు

AP CM Chandrababu: అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన.. సీఎం చంద్రబాబు

Indrakeeladri Rush: కిక్కిరిసిన ఇంద్రకీలాద్రి.. తిరుమల తరహాలో ఏర్పాట్లు.. నది స్నానాలపై నిషేధం

Mithun Reddy: బిగ్ రిలీఫ్.. లిక్కర్ కేసులో మిథున్ రెడ్డికి బెయిల్

Big Stories

×