E-Paper
Advertisement

Hobart Yacht Race : పడవ పోటీల్లో పిల్లి!

Hobart Yacht Race : పడవ పోటీల్లో పిల్లి!
Advertisement
Hobart Yacht Race

Hobart Yacht Race : ప్రపంచ సెయిలింగ్ పోటీల్లో రోలెక్స్ సిడ్నీ హోబాట్ యాచ్ రేస్ అత్యంత ప్రధానమైనది. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుంచి 1163 కిలోమీటర్ల(628 నాటికల్ మైళ్లు) దూరంలోని టాస్మేనియా రాజధాని హోబాట్ వరకు ఈ పడవ పోటీలు అత్యంత ఉత్సాహభరితంగా సాగుతాయి.
బాక్సింగ్ డే రోజైన మంగళవారం ఆరంభం కానున్న పోటీలు ఈ సారి వెరీ స్పెషల్.

అత్యంత కఠిన వాతావరణ పరిస్థితుల నడుమ జరిగే ఈ రేస్‌లో తొలిసారిగా ఓ మార్జాలం పాల్గొనడం విశేషం. తన యజమాని బాబ్ విలియమ్స్‌తో కలిసి పదేళ్ల వయసున్న ఓలి నదురు బెదురూ లేకుండా రెగెట్టాకు సిద్ధమైంది. మార్జాలాన్ని అనుమతించే విషయంలో అధికారులు తొలుత కొంత అయోమయంలో పడ్డారు. వాస్తవానికి హోబాట్ యాచ్ రేస్‌లో జంతువులు పాల్గొన్నరాదన్న నిబంధన ఏదీ లేదు.

Advertisement

పోటీ పడే సెయిలర్లు పూర్వం పావురాలను తీసుకెళ్లేవారు. తీరాన ఉన్న వారికి సందేశం అందజేసే ఆలోచనతో పావురాలు వెంటబెట్టుకుని వెళ్లేవారు. సముద్రయానాల్లో పెంపుడు పిల్లులను తీసుకెళ్లిన దాఖలాలు ఉన్నాయి. కానీ పడవల పోటీల్లో ఓ మార్జాలం పాలుపంచుకోవడం మాత్రం ఇదే తొలిసారి. సెయిలింగ్ పోటీల చరిత్రలో ఓలి ఇలా రికార్డులకెక్కింది.

విలియమ్స్‌తో కలిసి ఓలి ఇప్పటికే పలు సార్లు సముద్రయానం చేసింది. ఐదేళ్ల క్రితం తొలినాళ్ల ప్రయాణంలో కొంత అస్వస్థతకు గురైంది. రాన్రాను సముద్ర ప్రయాణానికి ఓలి అలవాటైపోయిందని విలియమ్స్ చెప్పుకొచ్చారు. అన్నట్టు.. ఓలికి ఈత కూడా వస్తుందట. అయినా అల్లకల్లోల పరిస్థితుల్లో పడవ తిరగబడినా.. ఓలి సముద్ర జలాల్లోకి జారిపోకుండా సురక్షిత చర్యలన్నీ తీసుకున్నానని విలియమ్స్ చెబుతున్నారు.

Advertisement

హోబాట్ యాచ్ రేస్‌లో చిన్నవి, పెద్దవి కలుపుకుని మొత్తం 113 పడవులు పోటీ పడుతున్నాయి. నిరుటి సంఖ్యతో పోలిస్తే ఈ సారి ఏడు మాత్రమే తక్కువ. 1945 నుంచి ఈ రేస్ జరుగుతుండగా.. ప్రముఖులెందరో పోటీపడ్డారు. మీడియా మొగల్ రూపర్ట్ ముర్దోక్ నుంచి ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజ క్రీడాకారుడు మైఖేల్ క్లార్క్, మాజీ ప్రధాని సర్ ఎడ్వర్డ్ హీత్ వరకు ఎందరో ఆ జాబితాలో ఉన్నారు. అందుకే ఏటా జరిగే హోబాట్ యాచ్ రేస్ అంటే ఎంతో క్రేజ్.

ఈ పోటీల్లో విజేతగా నిలవడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఎన్నో కఠిన పరిస్థితులను, ప్రతికూల వాతావరణాన్ని అధిగమించాల్సి ఉంటుంది. 1998లో జరిగిన పోటీల్లో పోటీదారులు పెనుతుఫానులో చిక్కుకున్నారు. ఆరుగురు సెయిలర్లు మరణించారు. అయిదు బోట్లు మునిగిపోయాయి. ఇప్పటివరకు జరిగిన పోటీల్లో అత్యంత దురదృష్టకరమైన ఘటన అదే. ఈ సారి కూడా అలాంటి పరిస్థితులే ఎదురుకావొచ్చని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉరుములతో కూడిన గాలివాన రావొచ్చని చెబుతున్నారు.

.

.

Related News

బోరిస్ జాన్సన్ ప్రయాణిస్తున్న రైలుపై రష్యా డ్రోన్ దాడి.. త్రుటిలో తప్పిన ప్రాణపాయం!

బ్రిక్స్ ప్రసంగాన్ని ఆపి జిన్‌పింగ్ గురించి ఆరా? మోదీ విందుకు దూరంగా చైనా అధ్యక్షుడు, పుతిన్ హాజరు

240 మంది ప్రయాణికులతో వెళ్తున్న షిప్ గల్లంతు.. జావా నుండి బోర్నియోకు వెళ్తుండగా ఘటన,

బ్రిక్స్ సదస్సులో చారిత్రక ఘట్టం.. ఢిల్లీ డిక్లరేషన్‌ కు ఏకగ్రీవ ఆమోదం!

భారత్‌కు అమెరికా బిగ్ షాక్? రష్యా క్రూడాయిల్ కొనుగోళ్లపై 100% టారిఫ్!

9/11 దాడులకు 25 ఏళ్లు.. బిన్ లాడెన్ కొడుకు రీ ఎంట్రీ.. అల్ ఖైదా కొత్త వీడియో కలకలం!

బంగ్లాదేశ్‌లో హిందూ సాధువు తీవ్ర భావోద్వేగం.. దేవుడి పాదాలు తాకి కన్నీటి పర్యంతం!

పుతిన్ ‘అంతర్గత’ భద్రత.. ఆయన టిష్యూల నుండి టవల్స్ వరకు, మలం కూడా మళ్లీ రష్యాకే

Big Stories

Advertisement
×