E-Paper
Advertisement

Husband: ఫస్ట్‌ నైట్ వీడియో సోషల్ మీడియాలో.. అప్‌లోడ్ చేసిన శాడిస్ట్ మొగుడు..

Husband: ఫస్ట్‌ నైట్ వీడియో సోషల్ మీడియాలో.. అప్‌లోడ్ చేసిన శాడిస్ట్ మొగుడు..
Advertisement

Husband: ఈమధ్య మనుషుల్లో పైశాచికత్వం బాగా పెరిగిపోతోంది. కామం రెక్కలు విరుచుకుంటోంది. ప్రేమ పేరుతో వేధింపులు, హత్యలు, దారుణాలు పెరిగిపోతున్నాయి. ఇదంతా ఓ టైపు అరాచకమైతే.. ఈ న్యూస్ ఇంకో రకం శాడిజం.

ఓ శుభముహూర్తాన వాళ్లిద్దరికి పెళ్లైంది. ఇంకో మంచి ముహూర్తం చూసి.. శోభనం ఏర్పాటు చేశారు. సక్సెస్‌ఫుల్‌గా తొలిరాత్రి ముగిసింది. అలా అలా కొన్ని రోజులు గడిచాయి. కట్ చేస్తే.. ఓ బ్యాడ్ డే సంచలన విషయం తెలిసింది. ఆ విషయం తెలిసి భార్య షాక్ అయింది. సిగ్గుతో చచ్చినంత పనైంది. భర్తపై విపరీతమైన కోపం వచ్చింది. విషయం పేరెంట్స్‌కు చెప్పగా ఆ శాడిస్ట్ భర్తను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు పోలీసులు. ఇంతకీ అసలేం జరిగిందంటే…

Advertisement

కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలోని ఓ తీరగ్రామంలో జరిగిందీ దారుణం. గత నెల ఫిబ్రవరి 8న ఆ యువకుడి(20)కి అదే గ్రామానికి చెందిన బాలిక(17)తో వివాహమైంది. అదే రోజు ఫస్ట్ నైట్ జరిగింది. కానీ, కొన్నిరోజులకే వారి తొలిరాత్రి దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి. వారి ఏకాంత కార్యమంతా ఆ వీడియోలో రికార్డైంది. అంతే. ఆ భార్యకు దిమ్మతిరిగి పోయింది. తామిద్దరమే ఉన్న గదిలో జరిగిన దృశ్యాలను ఎవరు రికార్డు చేసినట్టు? తమ గదిలోకి మూడో వ్యక్తి వచ్చే ఛాన్సే లేదు? మరి ఇంకెవరు ఈ పని చేసినట్టు? ఆమె అనుమానమే నిజమైంది. భర్తే ఈ దారుణానికి కారణమని తెలిసింది. ఫస్ట్ నైట్ శృంగారతంతు మొత్తం సెల్‌ఫోన్‌లో రికార్డు చేశాడు ఆ శాడిస్ట్ మొగుడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో కలకలం మొదలైంది. ఆ వీడియో వైరల్ అయి భార్య కంట పడటంతో విషయం వెలుగు చూసింది.

జరిగిన దారుణంపై బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, ఆమె పోలీసుల దగ్గరకు వెళ్లకుండా ఆ భర్త కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. గ్రామపెద్దలతో ప్రైవేటు పంచాయితీ చేసి.. మేటర్‌ను సైలెంట్‌గా క్లోజ్ చేయాలని చూశారు. కానీ, ఆ బాలిక తల్లి వారి ఒత్తిడికి లొంగకుండా.. పోలీసులనే ఆశ్రయించింది. ఆ సైకో భర్తను అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయగా.. 14 రోజుల రిమాండ్‌ పడింది. ఈ విషయం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×