E-Paper
Advertisement

Nara Lokesh Tweet: ఏపీ పెట్టుబడులపై నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్..

Nara Lokesh Tweet: ఏపీ పెట్టుబడులపై నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్..

Nara Lokesh Tweet: ఏపీలో పెట్టుబడులపై ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్‌ వేధికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. కర్ణాటక ప్రభుత్వం తెచ్చిన స్థానికులకు ఉద్యోగాలు అనే చట్టంపై జరుగుతున్న వివాదంపై లోకేష్ స్పందించారు. కర్ణాటకలో కొత్త చట్టంపై ఇన్వెస్టర్లు, బిజినెస్ మ్యాన్స్, నాస్కాం వంటి ఆర్గనైజేషన్స్ నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయని లోకేష్ తెలిపారు. అంతే కాకుండా దేశ వ్యాప్తంగా కర్ణాటక చట్టంపై చర్చ మొదలైన నేపథ్యంలో ఆ పరిణామాలను అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు.

నాస్కాం ట్వీట్ రీ ట్వీట్ చేస్తూ ఏపీలో పెట్టుబడులపై లోకేష్ ట్వీట్ చేసారు. ఇన్వెస్టర్ల ఆవేదన , అభ్యంతరాలు తాను అర్థం చేసుకుంటానని అన్నారు. ఏపీలో ఎటువంటి ఆంక్షలు, ఇబ్బందులు ఉండవని, పెట్టుబడులు పెట్టొచ్చంటూ ఓపెన్ ఇపర్ ఇచ్చారు. ఐటీ, ఐటీ ఆధారిత సేవలు, డాటా సెంటర్స్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వంటి రంగాల్లో విశాఖలో పెట్టుబడులు పెట్టాలంటూ ఆహ్వానం పలికారు. ఏపీ ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు, నిబంధనలు పెట్టదని.. ప్రభుత్వం నుంచి పూర్తి సహాకారం ఉంటుందని అన్నారు.

ఉత్తమ పాలసీలు, మౌళిక సదుపాయాలు, నిరంతర విద్యుత్‌తో పెట్టుబడులకు అనుకూలత వాతావరణం కల్పిస్తామని లోకేష్ అన్నారు. నిపుణులైన యువత, మానవ వనరులు ఏపీలో పుష్కలంగా ఉన్నాయని పెట్టుడులు పెట్టాలని నారా లోకేష్ పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఏపీలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ పారిశ్రామిక సంస్థలు కూడా ఆసక్తి చూపిస్తున్నాయి.

Also Read: అసెంబ్లీ సమావేశాల తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీ

దాదాపు 75 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులతో రాష్ట్రంలో ఆయిల్ రిఫైనరీ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసేందుకు దిగ్గజ ప్రభుత్వ రంగ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) ముందుకొచ్చిన విషయం తెలిసిందే. దీంతో పాటు మరిన్ని పరిశ్రమలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి నారా లోకేష్ ఈ బంపర్ ఆఫర్ ఇచ్చారు. రాష్ట్రంలో 4వేల కోట్ల పెట్టుబడులు పెడతామంటూ వియత్నాం ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో పేరున్న విన్ ఫాస్ట్ కంపెనీ సీఈఓ తెలిపారు.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×