E-Paper
Advertisement

Chandipura Virus: కలకలం సృష్టిస్తున్న చాందీపుర వైరస్.. నాలుగేళ్ల బాలిక మృతి

Chandipura Virus: కలకలం సృష్టిస్తున్న చాందీపుర వైరస్.. నాలుగేళ్ల బాలిక మృతి
Advertisement

Gujarat reports first fatality due to chadipura virus: గుజరాత్ రాష్ట్రంలో చాందీపుర వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఈ వైరస్ సోకి నాలుగేళ్ల బాలిక మృతిచెందింది. బాలికకు చాందీపుర వైరస్ సోకినట్లు పుణెలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ధృవీకరించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే, ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో చాందీపుర వైరస్ అనుమానిత ఇన్ఫెక్షన్ కేసులు 14 నమోదయ్యాయి. కాగా, వారిలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, బాలిక మృతిని మాత్రం వైరస్ కారణంగా అధికారులు ధృవీకరించారు. వారందరి శాంపిల్స్ ను ధృవీకరణ కోసం ఎన్ఐవీకి పంపినట్లు గుజరాత్ ఆరోగ్యశాఖ మంత్రి రిషికేశ్ పటేల్ తెలిపారు.

‘రాష్ట్రంలోని సబర్ కాంత జిల్లాలోని హిమత్ నగర్ లోని సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన బాలిక స్వస్థలం ఆరావళిలోని మూటా కంఠారియా గ్రామం. ఆ బాలిక శరీరంలో చాందీపుర వైరస్ ఉన్నట్లు తేలింది. ఈ వైరస్ మూలంగా గుజరాత్ రాష్ట్రంలో నమోదైన తొలి మరణం ఇదే’ అని జిల్లా ముఖ్య ఆరోగ్య అధికారి రాజ్ సుతారియా పేర్కొన్నారు. జిల్లా నుంచి పంపిన మూడు శాంపిల్స్ నెగెటివ్ గా తేలిందన్నారు. వారిలో ఒక రోగి మృతిచెందారని, మరో ఇద్దరు కోలుకున్నారని చెప్పారు.

Advertisement

Also Read: కొత్త స్కీమ్‌ను తీసుకొచ్చిన ప్రభుత్వం.. డిగ్రీ పూర్తయితే నెలకు రూ. 10 వేలు

ఈ అనుమానిత వైరస్ కేసులు ఆరావళి, మహిసాగర్, ఖేడా, సబర్ కాంత, మెహసనా, రాజ్ కోఠ్ జిల్లాల్లో నమోదైనట్లు మంత్రి రిషికేశ్ చెప్పారు. ఇద్దరు రాజస్థాన్ నుంచి, మరొకరు మధ్యప్రదేశ్ కు చెందినవారికి సోకగా, వారికి ఆసుపత్రుల్లో చికిత్స అందించినట్లు మంత్రి తెలిపారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 26 రెసిడెన్షియల్ జోన్ లలో 44 వేల మందికి స్క్రీనింగ్ పరీక్షలు చేసినట్లు ఆయన వివరించారు.

Advertisement

ఇదిలా ఉంటే.. ఈ వైరస్ సోకిన వ్యక్తిలో జ్వరం, ఫ్లూ, మెదడువాపు వంటి లక్షణాలు కనిపించనున్నాయి. దోమలు, ఇతర కీటకాల ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఇది రాబ్డోవిరిడే కుటుంబానికి చెందిన వెసిక్యులోవైరస్ జాతికి చెందినదంటూ వైద్యులు పేర్కొంటున్నారు.

Tags

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×