E-Paper
Advertisement

Ysrcp Politics: ఎట్టకేలకు ప్రయత్నాలు ఫలించాయి.. సజ్జల భార్గవ్‌కు కొత్త పోస్టు, ఈసారెక్కడ?

Ysrcp Politics: ఎట్టకేలకు ప్రయత్నాలు ఫలించాయి.. సజ్జల భార్గవ్‌కు కొత్త పోస్టు, ఈసారెక్కడ?
Advertisement

Ysrcp Politics: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాదిన్నర గడిచింది. ఎన్నికలకు మరో మూడున్నరేళ్లు సమయం ఉంది.  ఇప్పటి నుంచి వైసీపీ అధినేత జగన్ చకచకా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. అన్ని విభాగాలకు బలమైన, యువనేతలను నియమించారు. వైసీపీ సోషల్‌మీడియా మాజీ హెడ్‌ సజ్జల భార్గవ్‌కు కొత్త బాధ్యతలు అప్పగించారట అధినేత.

సజ్జల భార్గవ్‌కు కొత్త పోస్టు

Advertisement

వైసీపీ సోషల్ మీడియా విభాగం అంటే ముందుగా సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవ్ రెడ్డి గుర్తుకొస్తారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత దూరమయ్యారు. ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టడంలో విఫలమయ్యారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దూకుడుగా వ్యవహరించారాయన.

ముఖ్యంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్, ఎమ్మెల్యే బాలకృష్ణపై రకరకాల పోస్టింగులు పెట్టారు.  ఆ సెగ నేరుగా వైసీపీని తాకింది. అనుకోని పరిస్థితుల్లో వైసీపీ సోషల్ మీడియా విభాగానికి దూరంగా ఉన్నారు. సోషల్‌మీడియా వింగ్‌లో పని చేసేవారి పట్ల విభజించి-పాలించు అన్న కాన్సెప్ట్ మాదిరిగా వ్యవహరించేవారని అధినేత దృష్టికి వెళ్లింది.

Advertisement

సాక్షి డిజిటల్ మీడియా హెడ్‌గా

ఈ కారణంగా చాలామంది సోషల్ మీడియాకు దూరమయ్యారు. అనుకోని పరిస్థితుల్లో భార్గవ్ ఆ పదవికి రాజీనామా చేసినట్టు నేతలు చెబుతారు.  ప్రస్తుతం వైసీపీ సోషల్‌ మీడియా యాక్టివిస్టులు మళ్లీ యాక్టివేట్ అయ్యారు. టీడీపీ నేతలు ఫిర్యాదుతో మంగళగిరి పోలీసులు వివిధ సెక్షన్ల కింద సజ్జల భార్గవ్‌పై కేసు నమోదు చేశారు. పోలీసులు అరెస్టు చేస్తారని భయంతో నేరుగా సుప్రీంకోర్టుకి వెళ్లారు.

అతన్ని అరెస్టు చేయవద్దని పోలీసులు ఆదేశించింది. ప్రస్తుతం ఆ కేసు మెల్లగా నడుస్తోంది. తాజాగా సజ్జల భార్గవ్‌ని సాక్షి డిజిటల్ హెడ్‌గా నియమించినట్టు తెలుస్తోంది. రెండు రోజుల కొకసారి ఆయన ఆఫీసుకు వస్తున్నారట. డిజిటల్ కంటెంట్ విషయంలో ఉద్యోగులకు పలు సూచనలు చేసినట్టు తెలుస్తోంది.  ఈ లెక్కన సజ్జల భార్గవ్ ఇప్పుడు సొంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదు.

ALSO READ:  జగన్ కృష్ణాజిల్లా పర్యటనలో అపశృతి

ఏ పని చేసినా కచ్చితంగా ప్రస్తుతం ఆ ఛానెల్ డైరెక్టర్ అనుమతి తీసుకోవాల్సిందే. ఇన్నాళ్లు ఉన్నంత ఫ్రీడమ్ ఆయనకు ఉండదని ఆ పార్టీలో కొందరు నేతల మాట. మరి ఇక్కడైనా ఆయన రాణిస్తురా?  ఒత్తిడి పెట్టి  అందులో పని చేసేవారిని దూరం చేసుకుంటారా అనేది చూడాలి.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×