E-Paper
Advertisement

Srisailam Landslide: శ్రీశైలంలో భారీ వర్షాలు.. భారీ స్థాయిలో విరిగిపడుతున్న కొండచరియలు..

Srisailam Landslide: శ్రీశైలంలో భారీ వర్షాలు.. భారీ స్థాయిలో విరిగిపడుతున్న కొండచరియలు..
Advertisement

Srisailam Landslide: శ్రీశైలంల ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. పాతాళగంగ దగ్గర కొండచరియలు కూడా విరిగిపడ్డాయి. పైనుంచి జారిన బండరాళ్లు చెట్లను ఢీకొని కిందపడ్డాయి. ఆ ప్రాంతంలో భక్తులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పుణ్యస్నానాల కోసం భక్తులు పాతాళగంగకు నడిచి వెళ్లే మార్గంలో అడ్డంగా చెట్టు పడింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు వెంటనే స్పందించి ఆ చెట్లను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు.

రోడ్డు మళ్లీ ప్రారంభించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. గత రెండు వారాలుగా పర్వత ప్రాంతంలో తరచుగా వర్షాలు కురుస్తుండటంతో మట్టి సడిలి, కొండ చరియలు విరిగిపడే సంఘటనలు పెరిగాయని. భక్తులు జాగ్రత్తగా ప్రయాణించాలన్న విజ్ఞప్తి చేశారు.

Advertisement

గత వారం కూడా ఇదే ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి రోడ్డుకి అడ్డంగా పడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో పెద్ద ఎత్తున బండరాళ్లు కూలిపడటంతో వాహనాలు నిలిచిపోయాయి. అప్పట్లో అధికారులు తొలగించిన రాళ్ల ప్రాంతానికి సమీపంలోనే ..ఈసారి కూడా మరోసారి అదే తరహా ఘటన చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.

ఫారెస్ట్ అధికారులు, శ్రీశైలం ఘాట్ రోడ్ మెయింటెనెన్స్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. వర్షాల కారణంగా పాతాళగంగ ప్రాంతానికి వెళ్లే రోప్‌వే సేవలు తాత్కాలికంగా నిలిపివేశారు. భక్తులు అవసరమైతే మాత్రమే రాకపోకలు చేయాలని దేవస్థానం అధికారులు సూచించారు.

Advertisement

Also Read: ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులకు కన్నీరు.. ప్రభుత్వంపై జగన్ విమర్శలు

నంద్యాల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆ ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లు పెంచారు. ప్రమాదకర ప్రాంతాల వద్ద పోలీసు సిబ్బంది మోహరించారు. పర్యాటకులు, భక్తులు అధికారులు ఇచ్చే మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

 

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×