E-Paper
Advertisement

Srisailam Landslide: శ్రీశైలంలో భారీ వర్షాలు.. భారీ స్థాయిలో విరిగిపడుతున్న కొండచరియలు..

Srisailam Landslide: శ్రీశైలంలో భారీ వర్షాలు.. భారీ స్థాయిలో విరిగిపడుతున్న కొండచరియలు..
Advertisement

Srisailam Landslide: శ్రీశైలంల ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. పాతాళగంగ దగ్గర కొండచరియలు కూడా విరిగిపడ్డాయి. పైనుంచి జారిన బండరాళ్లు చెట్లను ఢీకొని కిందపడ్డాయి. ఆ ప్రాంతంలో భక్తులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పుణ్యస్నానాల కోసం భక్తులు పాతాళగంగకు నడిచి వెళ్లే మార్గంలో అడ్డంగా చెట్టు పడింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు వెంటనే స్పందించి ఆ చెట్లను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు.

రోడ్డు మళ్లీ ప్రారంభించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. గత రెండు వారాలుగా పర్వత ప్రాంతంలో తరచుగా వర్షాలు కురుస్తుండటంతో మట్టి సడిలి, కొండ చరియలు విరిగిపడే సంఘటనలు పెరిగాయని. భక్తులు జాగ్రత్తగా ప్రయాణించాలన్న విజ్ఞప్తి చేశారు.

Advertisement

గత వారం కూడా ఇదే ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి రోడ్డుకి అడ్డంగా పడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో పెద్ద ఎత్తున బండరాళ్లు కూలిపడటంతో వాహనాలు నిలిచిపోయాయి. అప్పట్లో అధికారులు తొలగించిన రాళ్ల ప్రాంతానికి సమీపంలోనే ..ఈసారి కూడా మరోసారి అదే తరహా ఘటన చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.

ఫారెస్ట్ అధికారులు, శ్రీశైలం ఘాట్ రోడ్ మెయింటెనెన్స్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. వర్షాల కారణంగా పాతాళగంగ ప్రాంతానికి వెళ్లే రోప్‌వే సేవలు తాత్కాలికంగా నిలిపివేశారు. భక్తులు అవసరమైతే మాత్రమే రాకపోకలు చేయాలని దేవస్థానం అధికారులు సూచించారు.

Advertisement

Also Read: ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులకు కన్నీరు.. ప్రభుత్వంపై జగన్ విమర్శలు

నంద్యాల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆ ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లు పెంచారు. ప్రమాదకర ప్రాంతాల వద్ద పోలీసు సిబ్బంది మోహరించారు. పర్యాటకులు, భక్తులు అధికారులు ఇచ్చే మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

 

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×