E-Paper
Advertisement

Fee Reimbursement: ఫీజు రియింబర్స్‌మెంట్ విధానంపై రేవంత్ సర్కాట్ కమిటీ ఏర్పాటు

Fee Reimbursement: ఫీజు రియింబర్స్‌మెంట్ విధానంపై రేవంత్ సర్కాట్ కమిటీ ఏర్పాటు
Advertisement

Fee Reimbursement: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ (Fee Reimbursement) విధానంలో సమగ్ర మార్పులు, మెరుగుదల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత విధానంపై సమగ్రంగా అధ్యయనం చేసి, ప్రభుత్వానికి సూచనలు అందించేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల 28న ఈ ఉత్తర్వులు జారీ అయినప్పటికీ, ప్రభుత్వం తాజాగా దీనిని వెల్లడించింది.

ఈ కమిటీకి సంక్షేమశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి  ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ప్రముఖ విద్యావేత్తలు, సామాజిక విశ్లేషకులు ప్రొఫెసర్‌ కోదండరాం, కంచె ఐలయ్యలను కమిటీలో సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. వీరితో పాటు, కీలక ప్రభుత్వ శాఖల కార్యదర్శులు కూడా ఇందులో భాగమవుతారు. ఆర్థిక, విద్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల కార్యదర్శులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి (Telangana State Council of Higher Education) ఛైర్మన్, ఉన్నత విద్యాసంస్థల నుంచి ముగ్గురు ప్రతినిధులు కూడా ఈ కమిటీలో సభ్యులుగా నియమితులయ్యారు.

Advertisement

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పాలసీపై సమగ్ర అధ్యయనం చేసి.. దానిని మెరుగుపరచడానికి లేదా కొత్త విధానాన్ని రూపొందించడానికి ఈ కమిటీ ప్రభుత్వానికి విలువైన సూచనలు ఇవ్వనుంది. ముఖ్యంగా, ప్రత్యేక ట్రస్ట్ ద్వారా ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపుల అమలుకు గల సాధ్యాసాధ్యాలను ఈ కమిటీ పరిశీలించనుంది. ప్రస్తుత ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానంలో ఉన్న లోటుపాట్లు, సమస్యలు, అలాగే విద్యార్థులకు, విద్యాసంస్థలకు మరింత సమర్థవంతంగా సాయం అందించే మార్గాలపై దృష్టి సారించనుంది.

ప్రభుత్వం జారీ చేసిన జీవోలో పేర్కొన్న దాని ప్రకారం.. మూడు నెలల్లోగా కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. విద్యా సంస్థలు వివిధ సందర్భాలలో ప్రభుత్వానికి చేసిన సూచనలను కూడా ఈ కమిటీ ప్రత్యేకంగా అధ్యయనం చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొనబడింది.

Advertisement

ALSO READ: BJP – JanaSena: జూబ్లీహిల్స్ బైపోల్‌లో బీజేపీకి మద్దతు ప్రకటించిన జనసేన..

తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ అనేది విద్యార్థులకు, ప్రైవేటు కళాశాలలకు మధ్య తరచుగా వివాదాలకు, బకాయిల సమస్యకు దారితీస్తోంది. కొన్ని సందర్భాల్లో, ప్రైవేటు విద్యాసంస్థలు ఫీజులు చెల్లించలేదని విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను ఆపివేయడం వంటి సంఘటనలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో.. బకాయిల సమస్యను పరిష్కరించడంతో పాటు, పారదర్శకతను పెంచడానికి, అర్హులైన ప్రతి పేద విద్యార్థికి సకాలంలో సహాయం అందేలా ఒక పటిష్టమైన, శాశ్వత విధానాన్ని తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కీలకమైన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా, తెలంగాణలోని లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానంలో భారీ మార్పులు వచ్చే అవకాశం ఉంది.

ALSO READ: YS Jaganmohan Reddy: ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులకు కన్నీరు.. ప్రభుత్వంపై జగన్ విమర్శలు

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×