BigTV English

Jagan: జైలులో మాజీ ఎంపీతో జగన్ ములాఖత్.. మేం వస్తే టీడీపీకి ఇదే గతి.. మళ్లీ అబద్దాలే..

Jagan: జైలులో మాజీ ఎంపీతో జగన్ ములాఖత్.. మేం వస్తే టీడీపీకి ఇదే గతి.. మళ్లీ అబద్దాలే..

Jagan: చంద్రబాబు సర్కార్‌పై మరోసారి విరుచుకుపడ్డారు వైసీపీ అధినేత జగన్. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగుతోందని దుయ్యబట్టారు. రెడ్ బుక్ పెట్టుకోవడం సులభమైన పని అని, అదేమీ ఘన కార్యంకాదన్నారు. రెడ్ బుక్ మీకే సొంతం అని అనుకోవద్దని, ఇలాంటి తప్పుడు సంప్రదాయం సునామీలా వస్తుందన్నారు. టీడీపీ భూస్థాపితం అయ్యే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారాయన.


వైసీపీ ప్రభుత్వం వస్తే.. టీడీపీ నాయకులకు ఇదే గతి పడుతుందని హెచ్చరించారు మాజీ సీఎం జగన్. ఇలాంటి దుర్మార్గమైన పాలనను తాను ఎప్పుడూ చూడలేదన్నారు. సాక్షులను బెదిరించి తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఇప్పుడు అరెస్ట్ అయినవారంతా ఆరోజు ఘటన జరిగిన ప్రదేశంలో లేరన్నారు.

ALSO READ: ఉభయ గోదావరి జిల్లాలను భయపెడుతున్న.. ఉగ్ర గోదావరి


నాలుగేళ్ల కిందట జరిగిన ఘటనపై ఇప్పుడు అరెస్ట్ చేయడమేంటని అన్నారు. ఆ రోజు ఏం జరిగిందో తెలుసా అని ప్రశ్నించారు. టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి.. ముఖ్యమంత్రిపై చేసిన కామెంట్స్‌ నేపథ్యంలో అభిమానులు టీడీపీ ఆఫీసు వద్ద ధర్నా చేశారంటూ మళ్లీ అబద్దాలు చెప్పే ప్రయత్నం చేశారు జగన్.

పనిలో పనిగా ప్రకాశం బ్యారేజ్ బోట్ల ఘటనపైనా స్పందించారు జగన్. బ్యారేజ్‌ను ఢీ కొట్టిన బోట్లకు పర్మిషన్ ఇచ్చిందెవరన్నారు. టీడీపీ గెలిచిన తర్వాత విజయోత్సవంలో ఆ బోట్లు పాల్గొన లేదా అంటూ ప్రశ్నించారు. ఈ కేసులో అరెస్టయిన నిందితులతో చంద్రబాబు, నారా లోకేష్ ఫోటోలు దిగలేదా అని అన్నారు.

కొట్టుకు వచ్చిన బోట్లను రాజకీయ చేస్తున్నారని దుయ్యబట్టారు పులివెందుల ఎమ్మెల్యే. కృష్ణాకు వరదలు వస్తున్నాయని తెలిసినా, భారీ వర్షాలు పడతాయని సమాచారం ఉన్నా సీఎం చంద్రబాబు రివ్యూ చేయలేదన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల 60 మంది చనిపోయారని ఆరోపించారు. ఆయనపై కేసు పెట్టాలన్నారు.

సీఎం చంద్రబాబు తప్పుల మీద తప్పులు చేస్తున్నారని, తన ఇంటిని కాపాడుకునేందుకు బుడమేరు గేట్లు ఎత్తారంటూ మళ్లీ అబద్దాలు చెప్పే ప్రయత్నం చేశారు జగన్. ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మరల్చడానికి వైసీపీ నేతలను అరెస్ట్ చేశారని విమర్శించారు. డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని ధ్వజమెత్తారు.

టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయస్థానం ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించింది. ఈ క్రమంలో బుధవారం మాజీ ఎంపీ నందిగామ సురేశ్‌తో జైల్లో ములాకత్ అయ్యారాయన. అనంతరం మీడియాతో మాట్లాడారాయన. జగన్ రాకను తెలుసుకున్న వైసీపీ అభిమానులు భారీ ఎత్తున జైలు వద్దకు చేరుకున్నారు. జై జగన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జగన్‌తో పాటు జైల్లోకి వెళ్లేందుకు యత్నించారు కార్యకర్తలు.

 

Related News

AP Rains: రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP Elections: నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు.. జనవరిలో నోటిఫికేషన్.. నీలం సాహ్ని ప్రకటన!

Toll Plaza Crowd: అమ‌లులోకి కొత్త రూల్స్‌.. టోల్ ప్లాజాల వద్ద భారీగా రద్దీ!

AP Free Coaching: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?

Jagan Assembly: ఈ మాస్ ర్యాగింగ్ ని జగన్ తట్టుకోగలరా? వైసీపీ వ్యూహం ఏంటి?

Dasara 2025: దసరా సంబరాలకు ముస్తాబైన ఇంద్రకీలాద్రి.. ఈ ఏడాది 11 రోజుల పాటు ఉత్సవాలు

Vijayawada Durga Festival: 10,000 సీసీ కెమెరాలతో.. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులకు భారీ బందోబస్తు

Tirumala Brahmotsavam 2025: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. బ్రహోత్సవాల డేట్స్ వచ్చేశాయ్

Big Stories

×