E-Paper
Advertisement

Kuppam: కుప్పంలో ఏం జరుగుతోంది? ఈసారి చంద్రబాబును గెలవనిస్తారా?

Kuppam: కుప్పంలో ఏం జరుగుతోంది? ఈసారి చంద్రబాబును గెలవనిస్తారా?
Advertisement

Kuppam: 175కి 175. జగన్ టార్గెట్ ఇది. ఏపీ మొత్తం క్లీన్ స్వీప్. అంటే, కుప్పంలో కూడా వైసీపీనే గెలవాలనేది జగన్ లెక్క. మరి, దశాబ్దాలుగా కుప్పంను ఏలుతున్న చంద్రబాబును ఓడించడం అంత ఈజీనా? అంటే, కాస్త కష్టపడితే ఈజీగానే బాబును ఓడించొచ్చు అంటోంది వైసీపీ. ఇప్పటికే ఆ దిశగా అనేక చర్యలు చేపట్టింది. కుప్పంపై స్వయంగా సీఎం జగనే స్పెషల్ ఫోకస్ పెట్టారు. కార్యచరణ సిద్ధం చేసి.. అమలు బాధ్యతలు మంత్రి పెద్దిరెడ్డికి అప్పగించారు. అందుకే, కుప్పం ఇప్పుడు కుతకుత ఉడుకుతోంది.

మున్సిపల్ ఎన్నికల్లోనే టీడీపీని దారుణంగా దెబ్బకొట్టింది వైసీపీ. మెజార్టీ స్థానాలు గెలుచుకుంది. మంత్రి పెద్దిరెడ్డి కుప్పంలో మకాం వేసి మరీ, పోలింగ్ సరళిని మేనేజ్ చేశారు. ఇప్పుడు కుప్పంలో వైసీపీ ప్రజాప్రతినిధుల సంఖ్యే ఎక్కువ. వైసీపీ అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడి గెలిచిందనేది టీడీపీ ఆరోపణ.

Advertisement

చంద్రబాబు మాత్రం కేడర్ నే నమ్ముకున్నారు. కుప్పం తన ఇలాఖా అంటున్నారు. ఇప్పటికీ బాబుకు ప్రజాధారణ ఎక్కువే. అభిమానం ఉన్నా.. ఓటింగ్ సమయానికి వైసీపీ ఏం చేస్తుందోననే భయం మాత్రం లేకపోలేదు. అందుకే, గతంలో ఎప్పుడో గానీ కుప్పం ముఖం చూడని చంద్రబాబు.. ఈమధ్య తరుచూ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. కేడర్ ను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక, సీఎం జగన్ కుప్పంలో తనదైన స్టైల్ పాలన సాగిస్తున్నారు. కుప్పంను రెవెన్యూ డివిజన్ గా చేసి నిధుల వరద పారిస్తున్నారు. చంద్రబాబు కుప్పంకు చేసిందేమీ లేదని.. కనీసం రెవెన్యూ డివిజన్ కూడా చేయలేదని.. అసలైన అభివృద్ధి ఏంటో తాను చేసి చూపిస్తానంటున్నారు. కుప్పంలో అద్దంలాంటి రోడ్లు వేయించారు. 1వ తారీఖు ఉదయం 7 గంటల కల్లా పింఛన్లు వేస్తున్నారు. పెండింగ్ పనులన్నిటినీ పూర్తి చేస్తున్నారు. అలా తటస్తులను ఆకర్షిస్తున్నారు.

Advertisement

భరత్ ను కుప్పంలో వైసీపీ అభ్యర్థిగా రెండేళ్లు ముందుగానే ప్రకటించారు జగన్. ఆయనకు ఎమ్మెల్సీ పదవి కూడా కట్టబెట్టి ఫుల్ పవర్స్ ఇచ్చారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. మంత్రిని కూడా చేస్తానని ముందే హామీ ఇచ్చారు. ఇలా పార్టీని అత్యంత పటిష్టంగా మార్చేసి.. అదే సమయంలో టీడీపీని దెబ్బకొడుతున్నారు జగన్. చంద్రబాబును, టీడీపీని భయాందోళనలకు గురి చేసి.. డిఫెన్స్ లో పడేలా చేసే ఎత్తుగడ అవలంభిస్తున్నారని అంటున్నారు.

చంద్రబాబు పర్యటనను పదే పదే అడ్డుకోవడం.. టీడీపీ నేతలపై కేసులు పెట్టడం.. తాజాగా చంద్రబాబు సభలు, ర్యాలీలకు అనుమతి నిషేధించడం.. ఇలా వరుస చర్యలతో కుప్పంలో ఇక టీడీపీ పని ఖతం అనేలా మెసేజ్ ఇస్తున్నారు. అయితే, చంద్రబాబుపై చేస్తున్న ఈ అతి బలప్రదర్శనపై ప్రజల్లో నుంచి వ్యతిరేకత కూడా వస్తోందని అంటున్నారు. వైసీపీ చేష్టలను చీదరించుకుంటున్నారని తెలుస్తోంది. ఎవరేమనుకున్నా తగ్గేదేలే అన్నట్టు కుప్పంలో చంద్రబాబు ఓటమిని జగన్ ఛాలెంజ్ గా తీసుకున్నారని అంటున్నారు.

అయితే, గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కూడా పులివెందులలో ఇలాంటి స్ట్రాటజీనే అప్లై చేసి ఫెయిల్ అయ్యారనే వాదనా వినిపిస్తోంది. పులివెందులకు పట్టిసీమ నుంచి నీళ్లు తరలించారు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. అంతచేసినా.. 2019 ఎన్నికల్లో పులివెందులలో జగన్ ప్రభంజనాన్ని అడ్డుకోలేకపోయారు. మరి, ఈసారి కుప్పంలో ఏం జరగబోతోంది? అనేది అత్యంత ఆసక్తికరంగా మారింది.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×