E-Paper
Advertisement

Janasena: విశాఖ సౌత్ బరిలో వంశీకృష్ణ శ్రీనివాస్ .. మరో అభ్యర్థిని ప్రకటించిన జనసేన..

Janasena: విశాఖ సౌత్ బరిలో వంశీకృష్ణ శ్రీనివాస్ .. మరో అభ్యర్థిని ప్రకటించిన జనసేన..

vamsi krisha srinivasa yadav

Vizag South Janasena Candidate: విశాఖ సౌత్ నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పేరును జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రకటించారు. పిఠాపురం పర్యటనలో ఉన్న జనసేనాని పార్టీ నేతలతో చర్చించిన తర్వాత వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పేరును ఖరారు చేశారు.

ఏపీలో టీడీపీ, బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనుంది. ఇంతకుముందు విడతలవారీగా 18 మంది అభ్యర్థులను జనసేనాని ప్రకటించారు. తాజాగా విశాఖ సౌత్ నియోజకవర్గ అభ్యర్థిని ప్రకటించడంతో 19 మంది అభ్యర్థులపై స్పష్టత వచ్చింది. ఇంకా రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అవనిగడ్డ, పాలకొండ నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగుతోంది. అక్కడ నుంచి ఎవరిని బరిలోకి దించనున్నారనే ఆసక్తి నెలకొంది.

మరోవైపు రెండు లోక్ సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను పవన్ కల్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. కాకినాడ నుంచి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ బరిలోకి దిగుతున్నారు. మచిలీపట్నం అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి పేరును ప్రకటించారు.

Also Read: వైసీపీ ఫ్యాన్‌కు సౌండ్ ఎక్కువ.. గాలి తక్కువ.. పవన్ కళ్యాణ్

జనసేన అసెంబ్లీ అభ్యర్థులు..
నెల్లిమర్ల – లోకం మాధవి
విశాఖ సౌత్ – వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్
అనకాపల్లి – కొణతాల రామకృష్ణ
పెందుర్తి – పంచకర్ల రమేష్‌ బాబు
యలమంచిలి – సుందరపు విజయ్‌ కుమార్‌
పిఠాపురం- పవన్‌ కల్యాణ్‌
కాకినాడ రూరల్‌ – పంతం నానాజీ
పి.గన్నవరం – గిడ్డి సత్యనారాయణ
రాజోలు – దేవ వరప్రసాద్‌

రాజానగరం – బత్తుల బలరామకృష్ణ
నిడదవోలు – కందుల దుర్గేష్‌
భీమవరం – పులపర్తి ఆంజనేయులు
నరసాపురం – బొమ్మిడి నాయకర్‌
తాడేపల్లిగూడెం – బొలిశెట్టి శ్రీనివాస్‌
ఉంగుటూరు – పత్సమట్ల ధర్మరాజు
పోలవరం – చిర్రి బాలరాజు

తెనాలి – నాదెండ్ల మనోహర్‌
తిరుపతి – అరణి శ్రీనివాసులు
రైల్వే కోడూరు – యనమల భాస్కరరావు

పెండింగ్ స్థానాలు..
అవనిగడ్డ
పాలకొండ

లోక్‌సభ అభ్యర్థులు..
కాకినాడ- తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌
మచిలీపట్నం- వల్లభనేని బాలశౌరి

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×