Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాలికి గాయమైంది. తిరుపతిలో జరగబోయే వారాహి విజయభేరి యాత్రలో పాల్గొనేందుకు రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకోగా.. ఆయన కాలికి గాయంతో కనిపించారు. దీంతో పవన్ కళ్యాణ్ నడవడానికి కాస్త ఇబ్బంది పడ్డారు. నిదానంగా నడుస్తూ కాన్వాయ్ ఎక్కారు.
అయితే జనసేనాని కాలికి గాయం అయినట్లు పార్టీ ఎటువంటి అధికారిక ప్రకటనా విడుదల చేయలేదు. అయితే ఆది పెద్ద గాయం కాకపోవడంతో పార్టీ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటనా రానట్లు సమాచారం. గాయం నుంచి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని జనసేన నేతలు, కార్యకర్తలు, ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.
Chief @PawanKalyan has landed in Tirupati and will be off to the meeting spot in a few mins pic.twitter.com/fdlCG8nYw0
— Supreme PawanKalyan FC™🥛 (@SupremePSPK) May 7, 2024