E-Paper
Advertisement

Road Accident : కేరళలో అంబులెన్స్- కారు ఢీ .. ముగ్గురు మృతి

Road Accident : కేరళలో అంబులెన్స్- కారు ఢీ .. ముగ్గురు మృతి

Krala Road Accident: కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాసర్ గోడ్ లో అంబులెన్స్  కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసం అయింది. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు పోలీసులు.

కేరళలోని కాసర్ గోడ్ ప్రాంతంలో కారును అంబులెన్స్ ఢీ కొట్టింది. కాసర్ గోడ్ నుంచి మంగళూరు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో త్రిసూర్ లోని ఇరింజలకుడాకు చెందిన శివ కుమార్ అతని కుమారులు..శరత్, సౌరవ్ లు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన మంగళవారం జరిగినట్లు వెల్లడించారు.

కాసర్ గోడ్ లోని మంజేశ్వర్ తాళ్లపాడు చెక్ పోస్ట్ సమీపంలో రోగితో వేగంగా వెళ్తున్న అంబులెన్స్ కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనలో కారు నుజ్జు నుజ్జు అయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీసారు. అనంతరం క్రేన్ సహాయంతో బోల్తా పడిన అంబులెన్స్ ను పోలీస్ స్టేషన్ కు తరలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.

Also Read: భర్తను సిగరెట్లతో కాల్చి.. ఛాతీపై కూర్చుని.. నరకం చూపించిన భార్య

మృతుడు శివ కుమార్ దుబాయ్ లోని ఓ ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల సెలవుల కోసం ఇంటికి వచ్చాడు. అయితే బంధువుల ఇంటికి కుటుంబ సభ్యులతో కలిసి కారులో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related News

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

Big Stories

×