E-Paper
Advertisement

Road Accident : కేరళలో అంబులెన్స్- కారు ఢీ .. ముగ్గురు మృతి

Road Accident : కేరళలో అంబులెన్స్- కారు ఢీ .. ముగ్గురు మృతి
Advertisement

Krala Road Accident: కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాసర్ గోడ్ లో అంబులెన్స్  కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసం అయింది. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు పోలీసులు.

కేరళలోని కాసర్ గోడ్ ప్రాంతంలో కారును అంబులెన్స్ ఢీ కొట్టింది. కాసర్ గోడ్ నుంచి మంగళూరు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో త్రిసూర్ లోని ఇరింజలకుడాకు చెందిన శివ కుమార్ అతని కుమారులు..శరత్, సౌరవ్ లు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన మంగళవారం జరిగినట్లు వెల్లడించారు.

Advertisement

కాసర్ గోడ్ లోని మంజేశ్వర్ తాళ్లపాడు చెక్ పోస్ట్ సమీపంలో రోగితో వేగంగా వెళ్తున్న అంబులెన్స్ కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనలో కారు నుజ్జు నుజ్జు అయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీసారు. అనంతరం క్రేన్ సహాయంతో బోల్తా పడిన అంబులెన్స్ ను పోలీస్ స్టేషన్ కు తరలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.

Also Read: భర్తను సిగరెట్లతో కాల్చి.. ఛాతీపై కూర్చుని.. నరకం చూపించిన భార్య

Advertisement

మృతుడు శివ కుమార్ దుబాయ్ లోని ఓ ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల సెలవుల కోసం ఇంటికి వచ్చాడు. అయితే బంధువుల ఇంటికి కుటుంబ సభ్యులతో కలిసి కారులో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×