Big Stories

Janasena Pending Seats : పెండింగ్ స్థానాలపై జనసేనాని ఫోకస్.. అక్కడ అభ్యర్థులెవరో ?

- Advertisement -

Machilipatnam Janasena MP Candidate : పెండింగ్ లో ఉన్న మచిలీపట్నం పార్లమెంట్ స్థానానికి జనసేన అభ్యర్థిని ప్రకటించింది. వల్లభనేని బాలశౌరి పేరును జనసేనాని పవన్ కల్యాణ్ అధికారికంగా ప్రకటించినట్లు.. పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులో భాగంగా జనసేన 21 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్ సభ స్థానాల్లో పోటీ చేయనుంది. 19 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన జనసేన.. మరో 2 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అవనిగడ్డ, పాలకొండ అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని నిర్ణయించాల్సి ఉంది. ఇక విజయవాడ వెస్ట్ సీటు కూడా పెండింగ్ లో ఉంది. పెండింగ్ స్థానాలపై ఫోకస్ పెట్టిన పవన్ కల్యాణ్ త్వరలోనే ఆయా స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటిస్తారని పార్టీ శ్రేణులు చెబుతున్నారు.

- Advertisement -

Also Read : మాటల వార్.. పిఠాపురంలో హీట్.. గీత ఆరు కోట్లు మింగేశారు?

నేటి నుంచి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించనున్నారు. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించిన తర్వాత తొలిసారి ఆయన పిఠాపురం రానున్నారు. అయితే ముందుగా ప్రకటించిన షెడ్యూల్ కాకుండా.. ఆయన టూర్ లో స్వల్ప మార్పులు జరిగాయి. పవన్ గొల్లప్రోలులో హెలికాప్టర్‌లో దిగి నేరుగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ ఇంటికి వెళ్లనున్నారు. అక్కడే భోజనం చేయనున్నారు. తర్వాత పాదగయ పుణ్యక్షేత్రాన్ని దర్శించనున్నారు. వారాహి వాహనానికి జనసేన నేతలు ప్రత్యేక పూజలు చేయనున్నారు. పూజల అనంతరం శ్రీపాద, శ్రీ వల్లభ దత్తాత్రేయుడిని పవన్ దర్శించుకోనున్నారు.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News