
Pithapuram political news(AP assembly elections 2024 updates): ఏపీలో అందరి చూపు పిఠాపురంపైనే ఉంది. ఎందుకంటే ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్కల్యాణ్ పోటీ చేస్తున్నారు. దీంతో ఈ నియోజకవర్గంపై అందరిచూపు పడింది. ఇక్కడ అధికార వైసీపీ-విపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం ముదిరిపాకాన పడింది.
ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేసేలా వ్యూహాలను రచిస్తున్నారు టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వర్మ.
తాజాగా అక్కడి నుంచి పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి వంగా గీతపై సంచలన కామెంట్స్ చేశారాయన. అందుకు సంబంధించి ఓ వీడియోను కూడా రిలీజ్ చేశారు.
కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీత భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు గుప్పించారు వర్మ. ముఖ్యంగా స్థానికంగా ప్రభుత్వ ఉద్యోగాల పేరిట ఆమె ఆరు కోట్లు సంపాదించారంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. వర్మ చేసిన ఆరోపణలు వైసీపీలో కలకలం రేపుతున్నాయి.
గతంలో పిఠాపురం ఎమ్మెల్యేగా వంగా గీత గెలిచారు. ఆమెపై అవినీతి ఆరోపణలు వర్మ చేయడం ద్వారా పవన్కు మార్గం సుగమం చేసినట్టు కనిపిస్తోందని అంటున్నారు అక్కడి ప్రజలు. రానున్న రోజుల్లో వైసీపీ అభ్యర్థి గురించి ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.
5 ఏళ్లు పిఠాపురం ప్రజలను గాలికి వదిలేసిన గీత గారు, ఇప్పుడు ఇలా వచ్చారు.. అలా పోస్టుల పేరుతో రూ. 6 కోట్ల అవినీతికి తెర తీశారు. పిఠాపురం అభివృద్ధిని గాలికి వదిలేసి ఇప్పుడు ఓట్ల కోసం వచ్చి హంగామా చేస్తే ప్రజలు నమ్మరు. వైసీపీని నమ్మే పరిస్థితే లేదు. pic.twitter.com/tYyPw9IrGB
— SVSN Varma (@SVSN_Varma) March 29, 2024