E-Paper
Advertisement

Nellore News : ఆలయంలో లంకె బిందె.. భారీగా బంగారు నాణేలు.. ముగ్గురి అరెస్ట్..

Nellore News : ఆలయంలో లంకె బిందె.. భారీగా బంగారు నాణేలు.. ముగ్గురి అరెస్ట్..
Advertisement
Nellore News

Nellore News : నెల్లూరు జిల్లా పొదలకూరు పంచాయతీ పరిధిలోను చిట్టేపల్లి గ్రామంలో ముగ్గురు యువకులకు దొరికిన లంకె బిందెను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మే 7న తేనె కోసం గ్రామ సమీపంలోని కొండపై ఉన్న పురాతన అంకమ్మ ఆలయం వద్దకు యువకులు వెళ్లారు. అక్కడ వారికి విలువైన బంగారు నాణేలతో కూడిన లంకెబిందె దొరికింది.

Advertisement

యువకులు కొన్ని నాణేల్ని చెన్నైలో విక్రయించి, సొమ్ము చేసుకున్నారు. విషయం పోలీసులకు తెలియడంతో అప్పటి నుంచి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎట్టకేళకు ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. నాణేలు చెన్నైలో విక్రయించి‌నట్టు గుర్తించారు. బిందెను చెరువులో పడవేశారనే సమాచారంతో చెరువు వద్దకు చేరుకుని.. 10 మంది గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. అయినా బిందె దొరకలేదు.

మరోవైపు.. చెన్నైలో విక్రయించిన బంగారు నాణేల్ని పోలీసులు రికవరీ చేశారు. 14 లక్షల నగదు, 21 సవర్ల బంగారు నగలు, 436 చిన్న బంగారు నాణేలు, 63 పెద్ద బంగారు నాణేలు, కారు, ఆటో స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురినీ అదుపులోకి తీసుకొని విచారించారు. గుప్త నిధులు, లంకెబిందెల కోసం ఎవరైనా ప్రయత్నిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని‌ నెల్లూరు రూరల్ డీఎస్పీ హెచ్చరించారు.

Related News

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

బిగ్‌ టీవీ ఎఫెక్ట్.. ఏపీ డీఎస్సీ స్కామ్ బట్టబయలు, ఎస్జీటీ ప్రభాకర్‌పై ఎంక్వైరీకి ఆదేశం

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు, లారీని ఢీ కొన్న ట్రావెల్ బస్సు, స్సాట్‌లో 15 మంది

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం? ఏపీకి వర్ష సూచన, అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

మీ భయానికి నిదర్శనం కాదా? బిగ్‌టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు ఎందుకు?- మాజీమంత్రి రోజా ప్రశ్న

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

Big Stories

Advertisement
×