E-Paper
Advertisement

Nellore News : ఆలయంలో లంకె బిందె.. భారీగా బంగారు నాణేలు.. ముగ్గురి అరెస్ట్..

Nellore News : ఆలయంలో లంకె బిందె.. భారీగా బంగారు నాణేలు.. ముగ్గురి అరెస్ట్..
Nellore News

Nellore News : నెల్లూరు జిల్లా పొదలకూరు పంచాయతీ పరిధిలోను చిట్టేపల్లి గ్రామంలో ముగ్గురు యువకులకు దొరికిన లంకె బిందెను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మే 7న తేనె కోసం గ్రామ సమీపంలోని కొండపై ఉన్న పురాతన అంకమ్మ ఆలయం వద్దకు యువకులు వెళ్లారు. అక్కడ వారికి విలువైన బంగారు నాణేలతో కూడిన లంకెబిందె దొరికింది.

యువకులు కొన్ని నాణేల్ని చెన్నైలో విక్రయించి, సొమ్ము చేసుకున్నారు. విషయం పోలీసులకు తెలియడంతో అప్పటి నుంచి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎట్టకేళకు ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. నాణేలు చెన్నైలో విక్రయించి‌నట్టు గుర్తించారు. బిందెను చెరువులో పడవేశారనే సమాచారంతో చెరువు వద్దకు చేరుకుని.. 10 మంది గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. అయినా బిందె దొరకలేదు.

మరోవైపు.. చెన్నైలో విక్రయించిన బంగారు నాణేల్ని పోలీసులు రికవరీ చేశారు. 14 లక్షల నగదు, 21 సవర్ల బంగారు నగలు, 436 చిన్న బంగారు నాణేలు, 63 పెద్ద బంగారు నాణేలు, కారు, ఆటో స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురినీ అదుపులోకి తీసుకొని విచారించారు. గుప్త నిధులు, లంకెబిందెల కోసం ఎవరైనా ప్రయత్నిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని‌ నెల్లూరు రూరల్ డీఎస్పీ హెచ్చరించారు.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×