E-Paper
Advertisement

Maha Shivaratri 2026: శంఖుపై శివతాండవం.. నంద్యాల చిత్రకారుడి అద్భుత కళాఖండం!

Maha Shivaratri 2026: శంఖుపై శివతాండవం.. నంద్యాల చిత్రకారుడి అద్భుత కళాఖండం!
Advertisement

Maha Shivaratri 2026: ఏపీలో అద్భుత ఘ‌ట‌న చోటుచేసుకుంది.. నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు, ‘కళారత్న’ అవార్డు గ్రహీత చింతలపల్లె కోటేశ్వరరావు తన అద్భుత సృజనాత్మకతతో మరోసారి వార్తల్లో నిలిచారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని, ఆయన ఒక సాధారణ శంఖంపై పరమశివుని లీలలను అక్రిలిక్ పెయింటింగ్స్‌తో అత్యంత మనోహరంగా తీర్చిదిద్దారు. భక్తిని, కళను రంగరించి ఆయన చేసిన ఈ ప్రయోగం చూసేవారిని మంత్రముగ్ధులను చేస్తోంది.

ఈ కళాఖండం వెనుక కోటేశ్వరి గారి పట్టుదల, ఏకాగ్రత అపారం. దాదాపు ఐదు గంటల పాటు నిర్విరామంగా శ్రమించి, శంఖం వంటి కఠినమైన ఉపరితలంపై అత్యంత సూక్ష్మ రూపంలో (Micro Art) శివతత్వాన్ని ఆవిష్కరించారు. రంగుల కలయికతో ఆయన సృష్టించిన ఈ చిత్రాలు సజీవంగా కనిపిస్తూ, భారతీయ సనాతన ధర్మ గొప్పతనాన్ని చాటిచెబుతున్నాయి.

Advertisement

శంఖుపై ఆయన చిత్రించిన ఘట్టాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అమృతం కోసం దేవదానవులు చేసిన క్షీర సాగర మథనం, శివపార్వతుల అన్యోన్యతకు ప్రతీక అయిన అర్ధనారీశ్వర రూపం, అత్యంత పవిత్రమైన ద్వాదశ జ్యోతిర్లింగాలు, కన్నుల పండువగా సాగే శివ పార్వతుల కళ్యాణ ఘట్టాన్ని కళ్లకు కట్టినట్లుగా చిత్రించారు. ప్రతి అంగుళంలోనూ సూక్ష్మమైన వివరాలను (Detailing) పొందుపరచడం ఆయన నైపుణ్యానికి నిదర్శనం.

Also Read: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా మహా శివరాత్రి వేడుకలు.. భక్తులతో కిటకిటలాడుతున్న ఆల‌యాలు

Advertisement

స్థానిక కళాకారుడైన కోటేశ్వరి ఇలాంటి విభిన్నమైన ప్రయోగాలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా అనేక జాతీయ, అంతర్జాతీయ వేదికలపై తన ప్రతిభను చాటి ఎన్నో పురస్కారాలను అందుకున్నారు. శివరాత్రి వేళ ఆయన సృష్టించిన ఈ ‘శంఖు-శివయ్య’ చిత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, కళాభిమానుల నుంచి నీరాజనాలు అందుకుంటోంది.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×