Junior Doctors: జూనియర్ డాక్టర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో ని జూనియర్ డాక్టర్లందరికీ పెండింగ్లో ఉన్న స్టైపెండ్లు, ఏరియర్స్ ను పూర్తిగా ప్రభుత్వం విడుదల చేసింది. దాదాపు రూ.19 కోట్లు విలువైన పెండింగ్ ఏరియర్లు విడుదల చేశారు. ఇందులో 2023, 2024 పోస్ట్గ్రాడ్యుయేట్ బ్యాచ్లకు చెందిన జూనియర్ డాక్టర్లు కూడా ఉన్నారు. ఏరియర్లకు అర్హత కలిగిన సీనియర్ రెసిడెంట్లకు కూడా వారి హానరేరియం జమ చేయబడింది.
జనవరి 2025 నుంచి జూన్ 2025 వరకు జీవో 90 ప్రకారం స్టైపెండ్ సవరణల ఆధారంగా పోస్ట్గ్రాడ్యుయేట్ డాక్టర్లు, సీనియర్ రెసిడెంట్లకు, 2019 నుంచి 2020 బ్యాచ్ల హౌస్ సర్జన్లు, సూపర్ స్పెషాలిటీ పోస్ట్గ్రాడ్యుయేట్లకు ఎరియర్లు జమ చేశారు. సాధారణ స్టైపెండ్లు కూడా చెల్లించామని వైద్యశాఖ పేర్కొన్నది. 2021 బ్యాచ్కు చెందిన, ఎంఢీ పూర్తి చేసి ప్రస్తుతం సీనియర్ రెసిడెంట్లుగా సేవలందిస్తున్న పోస్ట్గ్రాడ్యుయేట్ డాక్టర్లూ ఏరియర్స్ పొందారు.
Also Read; Hitech City Traffic: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. హైటెక్ సిటీలో ట్రాఫిక్ నివారణకు యాక్షన్ ప్లాన్..!
ఇక 2022 బ్యాచ్కు చెందిన, ఇటీవల ఎంఢీ పూర్తి చేసి సీనియర్ రెసిడెన్సీలో చేరిన పోస్ట్గ్రాడ్యుయేట్ డాక్టర్లు కూడా తమ ఎరియర్లు పొందారు. అలాగే హౌస్ సర్జన్లు, సూపర్ స్పెషాలిటీ పోస్ట్గ్రాడ్యుయేట్లు కూడా తమ పెండింగ్ బకాయిలను పొందారు.పెండింగ్ బిల్లులు విడుదలకు కారణమైన మంత్రి దామోదర రాజనర్సింహా, హెల్త్ సెక్రటరీ, డీఎంఈ డాక్టర్ నరేంద్రకుమార్ లు జూడా టీమ్ డాక్టర్ ఐజాక్ న్యూటన్, డాక్టర్ అజయ్ కుమార్ గౌడ్లు కృతజ్ఞతలు తెలిపారు.
Also Read: Vijay Devarakonda : సీఏం రేవంత్ రెడ్డిని కలిసిన విజయ్ దేవరకొండ.. పెళ్లి ఆహ్వానమేనా..?