Mandous Effect : తెలుగు రాష్ట్రాల్లో మాండూస్ తుఫాన్ ప్రభావం తగ్గినా… రైతులకు మాత్రం తీవ్ర నష్టం వాటిల్లింది. చేతికి అందిన పంటలు వర్షార్పణం అయ్యాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో కురుస్తున్న వర్షాలకు రైతులు తీవ్రనష్టాలు చవిచూశారు. తోపుడుబండ్లపై చిరువ్యాపారాలు చేసుకునే వారంతా… వ్యాపారం లేక ఇక్కట్లు పడుతున్నారు.
నియోజకవర్గం పరిధిలోని ఆరు మండలాలలో… అధిక సంఖ్యలో శనగపంట దెబ్బతినగా….పెద్దఎత్తున పచ్చిమిర్చి…వర్షార్పమైంది. పత్తి , అరటి, పొగాకు, వరి పంటలు వేసి చాలా నష్టపోయాయమని రైతులు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాలలో చెరకు, టమాట పంటలు కూడా రైతులు నష్టపోయారు. నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం ఐకేపీ కేంద్రంలో వరిధాన్యం తడిసింది. అమ్ముకునే సమయంలో సంభవించిన విపత్కర పరిస్థితి పట్ల అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.