BigTV English

AP Cabinet : ఉచితంగా 5 లక్షల ట్యాబ్స్, రూ.2750కు పెన్షన్ పెంపు.. ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..

AP Cabinet : ఉచితంగా 5 లక్షల ట్యాబ్స్, రూ.2750కు పెన్షన్ పెంపు.. ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..

AP Cabinet : ఏపీ క్యాబినెట్ ఈ రోజు కీలక నిర్ణయాలు తీసుకొంది. పెన్షన్, విద్యార్ధులకు ట్యాబ్స్, భూముల రీసర్వే, తితిదేలో ఛీఫ్ పీఆర్వో పోస్ట్, తదితర అంశాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి జగన్ పుట్టిన రోజు సందర్భంగా డిసెంబర్ 21న రాష్ట్రత్యవాప్తంగా 8వ తరగతి విద్యార్ధులకు 5 లక్షల ట్యాబ్స్‌ను పంపిణీ చేయాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకొంది.


మరోవైపు ఇప్పుడిచ్చే పెన్షన్‌ను రూ.2500 నుంచి రూ.2750కి పెంచాలని కూడా క్యాబినెట్ తీర్మాణం చేసింది. జనవరి 1 నుంచి ఈ పెన్షన్ అందేలా క్యాబినెట్ నిర్ణయం తీసుకొంది. తాజా నిర్ణయం వల్ల 62.31 లక్షల మంది పెన్షనర్లకు లబ్ది చేకూరనుంది. అన్ని ప్రభుత్వం స్కూల్స్‌లో వర్చువల్ లర్నింగ్, స్కూళ్లలో స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేయించేలా క్యాబినెట్ నిర్ణయం తీసుకొంది.

కొత్తగా ఏర్పాటైన జిల్లాలో వైసీపీ పార్టీ కార్యాలయాల కోసం స్థల కేటాయింపుల పైనా నిర్ణయం తీసుకున్నారు. కడప స్టీల్ ప్లాంట్ కోసం జిందాల్ స్టీల్ ప్లాంట్‌తో ఒప్పందం చేసుకునే నిర్ణయంపై కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ జ్యుడిషియల్ అకాడమీలో 55 పోస్టులను భర్తీ చేయడానికి కూడా ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది.


Tags

Related News

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Big Stories

×