E-Paper
Advertisement

Maoist Top leader: వరుస ఎన్‌కౌంటర్ల వేళ.. మావోయిస్టు అగ్రనేత మల్లోజుల మరో వీడియో

Maoist Top leader: వరుస ఎన్‌కౌంటర్ల వేళ.. మావోయిస్టు అగ్రనేత మల్లోజుల మరో వీడియో
Advertisement

Maoist Top leader: మావోయిస్టు ఉద్యమం బలహీన పడిన నేపథ్యంలో అగ్రనేత మల్లోజుల మరో వీడియో విడుదల చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో మావోయిస్టులు లొంగిపోవాలని కోరారు. పరిస్థితులు మారుతున్నాయి, దేశం కూడా మారుతోందని అన్నారు. చాలామంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

వరుస ఎన్‌కౌంటర్ల వేళ మావో అగ్రనేత మల్లోజుల మరో వీడియో

Advertisement

ఇప్పటికే హిడ్మాతో‌పాటు పలువురి ప్రాణాలు పోయాయని గుర్తు చేశారు. అంతమంది కీలక నేతలు ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగించిందని అన్నారు. ఛత్తీస్‌ఘడ్ ఫారెస్టులో ఆపరేషన్ ‘కగార్’ తర్వాత మావోయిస్టు అగ్రనేతలు హతమయ్యారు. బలగాలు ఓ వైపు కూంబింగ్ చేస్తూనే మరోవైపు డ్రోన్లలో ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టారు.

కీలకమైన నేతలు హతమయ్యారు. గడిచిన రెండురోజులుగా దాడుల మాస్టర్ మైండ్ హిడ్మా, కేంద్ర కమిటీ సభ్యులు, జోనల్ కమిటీ సభ్యులు ఎదురుకాల్పుల్లో మృతి చెందడంతో ఇక మావోయిస్టుల పనైపోయిందని భావించారు. ఈ నేపథ్యంలో అగ్రనేత మల్లోజుల మరో వీడియో రిలీజ్ చేశారని అంటున్నారు.

Advertisement

మావోయిస్టులు లొంగిపోవాలి-మల్లోజుల

వివిధ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు..  దాదాపు 95 శాతం మావోయిస్టులు తుడిచిపెట్టుకుపోయారని అంటున్నారు. లొంగిపోయినవాళ్లు కొందరైతే, ఎన్‌కౌంటర్లలో మరణించినవాళ్లు ఇంకొందరు. దీంతో యువత అటువైపు వెళ్లేందుకు మొగ్గు చూపడం లేదని పౌర సంఘాల హక్కుల నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం మావోయిస్టులు ఐదు శాతం మాత్రమే ఉంటారని అంచనా వేస్తున్నారు.

ALSO READ: ఎదురుకాల్పుల్లో హిడ్మా హతం.. ఆ వార్తలు అవాస్తవమన్న ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ

దాదాపు టాప్ నేతలతో మరణించారని అంటున్నారు. మంగళవారం ఒక్క ఏపీలో 50 మంది మావోయిస్టులు అరెస్టు అయ్యారు. ఏపీ చరిత్రలో ఆ స్థాయిలో మావోలు అరెస్టు కావడం ఇదే తొలిసారి. ఈ లెక్కన ఛత్తీస్‌ఘడ్ అడవులు దాదాపుగా ఖాళీ అయ్యాయని అంటున్నారు. అటువైపు నుంచి వలస వస్తున్న క్రమంలో ఏపీలో చిక్కుతున్నారని అంటున్నారు. గడిచిన రెండురోజుల్లో 13 మంది మావోయిస్టులు ఎదురుకాల్పుల్లో చనిపోయారు.

 

Related News

నెల్లూరులో చెత్త నిధులపై మాటల యుద్ధం.. సవాల్ విసిరిన వైసీపీ.. తిప్పికొట్టిన కూటమి!

పల్నాడులో విషాదం.. బైక్‌ను ఢీకొన్న ట్రావెల్ బస్సు, ఇద్దరి మృతి!

చిటికెలో సమస్యలు పరిష్కారం, శ్రీవారి భక్తులకు తోడుగా ‘నందకం’

శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. సోమవారం నుంచి సర్వ దర్శనం టోకెన్లు నిలిపివేత

మూడురోజులుగా కుమ్మేస్తున్న వర్షాలు.. ఉప్పొంగుతున్న జలపాతాలు, పర్యాటకులకు నో ఎంట్రీ

అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో కుమ్మేస్తున్న వర్షాలు, తెల్లవారుజామున హైదరాబాద్‌లో భారీ వర్షం

పల్నాడులో పిడుగు పడి నలుగురు మృతి.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు

నంద్యాలలో విద్యుత్ JE మిస్సింగ్ కలకలం.. తిరుపతి వెళ్తున్నానని చెప్పి ఎక్కడికెళ్లారు?

Big Stories

Advertisement
×