E-Paper
Advertisement

Maoist Top leader: వరుస ఎన్‌కౌంటర్ల వేళ.. మావోయిస్టు అగ్రనేత మల్లోజుల మరో వీడియో

Maoist Top leader: వరుస ఎన్‌కౌంటర్ల వేళ.. మావోయిస్టు అగ్రనేత మల్లోజుల మరో వీడియో
Advertisement

Maoist Top leader: మావోయిస్టు ఉద్యమం బలహీన పడిన నేపథ్యంలో అగ్రనేత మల్లోజుల మరో వీడియో విడుదల చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో మావోయిస్టులు లొంగిపోవాలని కోరారు. పరిస్థితులు మారుతున్నాయి, దేశం కూడా మారుతోందని అన్నారు. చాలామంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

వరుస ఎన్‌కౌంటర్ల వేళ మావో అగ్రనేత మల్లోజుల మరో వీడియో

Advertisement

ఇప్పటికే హిడ్మాతో‌పాటు పలువురి ప్రాణాలు పోయాయని గుర్తు చేశారు. అంతమంది కీలక నేతలు ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగించిందని అన్నారు. ఛత్తీస్‌ఘడ్ ఫారెస్టులో ఆపరేషన్ ‘కగార్’ తర్వాత మావోయిస్టు అగ్రనేతలు హతమయ్యారు. బలగాలు ఓ వైపు కూంబింగ్ చేస్తూనే మరోవైపు డ్రోన్లలో ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టారు.

కీలకమైన నేతలు హతమయ్యారు. గడిచిన రెండురోజులుగా దాడుల మాస్టర్ మైండ్ హిడ్మా, కేంద్ర కమిటీ సభ్యులు, జోనల్ కమిటీ సభ్యులు ఎదురుకాల్పుల్లో మృతి చెందడంతో ఇక మావోయిస్టుల పనైపోయిందని భావించారు. ఈ నేపథ్యంలో అగ్రనేత మల్లోజుల మరో వీడియో రిలీజ్ చేశారని అంటున్నారు.

Advertisement

మావోయిస్టులు లొంగిపోవాలి-మల్లోజుల

వివిధ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు..  దాదాపు 95 శాతం మావోయిస్టులు తుడిచిపెట్టుకుపోయారని అంటున్నారు. లొంగిపోయినవాళ్లు కొందరైతే, ఎన్‌కౌంటర్లలో మరణించినవాళ్లు ఇంకొందరు. దీంతో యువత అటువైపు వెళ్లేందుకు మొగ్గు చూపడం లేదని పౌర సంఘాల హక్కుల నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం మావోయిస్టులు ఐదు శాతం మాత్రమే ఉంటారని అంచనా వేస్తున్నారు.

ALSO READ: ఎదురుకాల్పుల్లో హిడ్మా హతం.. ఆ వార్తలు అవాస్తవమన్న ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ

దాదాపు టాప్ నేతలతో మరణించారని అంటున్నారు. మంగళవారం ఒక్క ఏపీలో 50 మంది మావోయిస్టులు అరెస్టు అయ్యారు. ఏపీ చరిత్రలో ఆ స్థాయిలో మావోలు అరెస్టు కావడం ఇదే తొలిసారి. ఈ లెక్కన ఛత్తీస్‌ఘడ్ అడవులు దాదాపుగా ఖాళీ అయ్యాయని అంటున్నారు. అటువైపు నుంచి వలస వస్తున్న క్రమంలో ఏపీలో చిక్కుతున్నారని అంటున్నారు. గడిచిన రెండురోజుల్లో 13 మంది మావోయిస్టులు ఎదురుకాల్పుల్లో చనిపోయారు.

 

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×