Markapuram Bus Accident: ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా పెను విషాదాన్ని నింపింది. ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన ఏఐ జెనెరేటెడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
గురువారం తెల్లవారుజామున సుమారు 6:00 నుండి 6:30 గంటల సమయంలో, నిర్మల్ నుండి నెల్లూరు జిల్లా ఉదయగిరి వైపు వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు రాయవరం గ్రామ సమీపంలోని పలకల క్వారీల వద్దకు చేరుకుంది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ఒక టిప్పర్ను ఈ బస్సు అత్యంత వేగంగా, బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే బస్సులో మంటలు చెలరేగి, క్షణాల్లోనే వాహనం మొత్తం విస్తరించాయి.
ప్రమాదం జరిగిన సమయం తెల్లవారుజాము కావడంతో ప్రయాణికులందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే మంటలు బస్సును చుట్టుముట్టాయి.మంటల ధాటికి సుమారు 20 మంది ప్రయాణికులు బస్సులోనే సజీవ దహనమయ్యారు. మృతుల్లో చిన్నపిల్లలు ఉండటం మరింత కలచివేసే అంశం.
మార్కాపురం బస్సు ప్రమాదం. ఏఐ వీడియో
Markapuram Bus Accident: AI Generated Video pic.twitter.com/2C0JubYMXf
— BIG TV Breaking News (@bigtvtelugu) March 26, 2026