E-Paper
Advertisement

Amaravati: మంత్రి లోకేష్ కొత్త సంప్ర‌దాయానికి శ్రీకారం.. ఎమ్మెల్యేల కుటుంబసభ్యులతో డిన్నర్ భేటీలు

Amaravati: మంత్రి లోకేష్ కొత్త సంప్ర‌దాయానికి శ్రీకారం.. ఎమ్మెల్యేల కుటుంబసభ్యులతో డిన్నర్ భేటీలు
Advertisement

Amaravati: ఏపీ మంత్రి నారా లోకేశ్ కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ప్రజాప్రతినిధులతో సంబంధాలను బలోపేతం చేసుకునే దిశగా తొలి అడుగు వేశారు. ‘కుటుంబసభ్యులతో ఆత్మీయ విందు పేరుతో సమావేశాలు ప్రారంభించారు. ప్రతిరోజూ ఒక్కో జిల్లాకు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేల కుటుంబసభ్యులతో కలిసి విందులో పాల్గొంటారు.

కొత్త సంప్ర‌దాయానికి శ్రీకారం చుట్టిన మంత్రి లోకేష్ 

Advertisement

టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు పరిపాలనలో బిజీగా ఉంటున్నారు. ఓ వైపు అధికారులతో సమావేశాలు, మరోవైపు కూటమిలోని మిత్రులతో భేటీ, ఇంకోవైపు రాష్ట్రానికి వచ్చే అతిధులతో తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ బాధ్యతలు చూస్తూనే యాక్టివ్‌గా ఉన్నారు మంత్రి నారా లోకేష్. కేవలం పార్టీ కార్యకర్తలు మాత్రమేకాదు.. నేతల కుటుంబాలతో భేటీ కావాలని డిసైడ్ అయ్యారు.

ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 12 నుంచి మార్చి 7 వరకు రోజుకో జిల్లాకు చెందిన కూటమి ఎమ్మెల్యేల కుటుంబసభ్యులతో డిన్నర్ సమావేశాలు మొదలుపెట్టారు. తొలి సమావేశం మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులు, వారి వారి కుటుంబసభ్యులతో జరిగింది. ఈ సందర్భంగా లోకేష్ ఎమ్మెల్యేలు, వారి కుటుంబసభ్యులను పేరు పేరునా పలకరించి ఆప్యాయంగా ముచ్చటించారు. వారితో కలిసి భోజనం చేశారు.

Advertisement

అమరావతిలో ఎమ్మెల్యేల కుటుంబసభ్యులతో డిన్నర్ భేటీలు

కేవలం విందుకు పరిమితం కాలేదు. ఎమ్మెల్యేల పిల్లలు ఏం చేస్తున్నారు? ఎక్కడ చదువుతున్నారు? అనే విషయాలను తెలుసుకున్నారు. రాజకీయాల చర్చలకు ఏమాత్రం తావులేకుండా కుటుంబసభ్యుల ఆత్మీయ సమ్మేళనం మాదిరిగా నిర్వహించారు. నియోజకవర్గాల్లోని సమస్యలపై ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా చర్చించారు.

గతంలో వారు ఇచ్చిన వినతులను నివేదిక రూపంలో వారికి అందజేశారు. అందులో ఎన్ని పరిష్కరించారు? కొన్ని ఏయే దశల్లో ఉన్నాయి? పరిష్కారం లేకపోతే కారణాలేంటి? ఆ నివేదికలో ఉన్నాయి.  డిన్నర్ భేటీలకు వచ్చిన ఇంటి ఆడపడుచులకు లోకేశ్ మంగళగిరి పట్టు చీరలను అందజేశారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగిన ఆత్మీయ కలయిక తనలో సంతోషాన్ని నింపిందంటూ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు మంత్రి లోకేష్.

ALSO READ:  శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు

రాజకీయ చర్చలకు తావులేకుండా కుటుంబసభ్యుల ఆత్మీయ సమ్మేళనం మాదిరిగా నిర్వహించారు. అందులో ఎన్ని పరిష్కరించారు? కొన్ని ఏయే దశల్లో ఉన్నాయి? పరిష్కారం లేకపోతే కారణాలేంటి? ఆ నివేదికలో ఉన్నాయి. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం ప్రజాప్రతినిధులు మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు యార్లగడ్డ, కాగిత కృష్ణప్రసాద్, బుద్ధప్రసాద్, కుమార్‌రాజా, బోడే ప్రసాద్, జీవీ ఆంజనేయులు వారి వారి కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఎంపీ బాలశౌరి, అమెరికా పర్యటనలో ఉండడంతో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు.

 

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×