Amaravati: ఏపీ మంత్రి నారా లోకేశ్ కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ప్రజాప్రతినిధులతో సంబంధాలను బలోపేతం చేసుకునే దిశగా తొలి అడుగు వేశారు. ‘కుటుంబసభ్యులతో ఆత్మీయ విందు పేరుతో సమావేశాలు ప్రారంభించారు. ప్రతిరోజూ ఒక్కో జిల్లాకు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేల కుటుంబసభ్యులతో కలిసి విందులో పాల్గొంటారు.
కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన మంత్రి లోకేష్
టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు పరిపాలనలో బిజీగా ఉంటున్నారు. ఓ వైపు అధికారులతో సమావేశాలు, మరోవైపు కూటమిలోని మిత్రులతో భేటీ, ఇంకోవైపు రాష్ట్రానికి వచ్చే అతిధులతో తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ బాధ్యతలు చూస్తూనే యాక్టివ్గా ఉన్నారు మంత్రి నారా లోకేష్. కేవలం పార్టీ కార్యకర్తలు మాత్రమేకాదు.. నేతల కుటుంబాలతో భేటీ కావాలని డిసైడ్ అయ్యారు.
ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 12 నుంచి మార్చి 7 వరకు రోజుకో జిల్లాకు చెందిన కూటమి ఎమ్మెల్యేల కుటుంబసభ్యులతో డిన్నర్ సమావేశాలు మొదలుపెట్టారు. తొలి సమావేశం మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులు, వారి వారి కుటుంబసభ్యులతో జరిగింది. ఈ సందర్భంగా లోకేష్ ఎమ్మెల్యేలు, వారి కుటుంబసభ్యులను పేరు పేరునా పలకరించి ఆప్యాయంగా ముచ్చటించారు. వారితో కలిసి భోజనం చేశారు.
అమరావతిలో ఎమ్మెల్యేల కుటుంబసభ్యులతో డిన్నర్ భేటీలు
కేవలం విందుకు పరిమితం కాలేదు. ఎమ్మెల్యేల పిల్లలు ఏం చేస్తున్నారు? ఎక్కడ చదువుతున్నారు? అనే విషయాలను తెలుసుకున్నారు. రాజకీయాల చర్చలకు ఏమాత్రం తావులేకుండా కుటుంబసభ్యుల ఆత్మీయ సమ్మేళనం మాదిరిగా నిర్వహించారు. నియోజకవర్గాల్లోని సమస్యలపై ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా చర్చించారు.
గతంలో వారు ఇచ్చిన వినతులను నివేదిక రూపంలో వారికి అందజేశారు. అందులో ఎన్ని పరిష్కరించారు? కొన్ని ఏయే దశల్లో ఉన్నాయి? పరిష్కారం లేకపోతే కారణాలేంటి? ఆ నివేదికలో ఉన్నాయి. డిన్నర్ భేటీలకు వచ్చిన ఇంటి ఆడపడుచులకు లోకేశ్ మంగళగిరి పట్టు చీరలను అందజేశారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగిన ఆత్మీయ కలయిక తనలో సంతోషాన్ని నింపిందంటూ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు మంత్రి లోకేష్.
ALSO READ: శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు
రాజకీయ చర్చలకు తావులేకుండా కుటుంబసభ్యుల ఆత్మీయ సమ్మేళనం మాదిరిగా నిర్వహించారు. అందులో ఎన్ని పరిష్కరించారు? కొన్ని ఏయే దశల్లో ఉన్నాయి? పరిష్కారం లేకపోతే కారణాలేంటి? ఆ నివేదికలో ఉన్నాయి. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం ప్రజాప్రతినిధులు మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు యార్లగడ్డ, కాగిత కృష్ణప్రసాద్, బుద్ధప్రసాద్, కుమార్రాజా, బోడే ప్రసాద్, జీవీ ఆంజనేయులు వారి వారి కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఎంపీ బాలశౌరి, అమెరికా పర్యటనలో ఉండడంతో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు.
నా ఆహ్వానం మేరకు ఉండవల్లి నివాసానికి వచ్చిన మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గం కూటమి ప్రజాప్రతినిధులు, వారి కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేశాను. పేరుపేరునా పలకరించి, యోగక్షేమాలు తెలుసుకున్నాను. ఆయా ప్రజా ప్రతినిధులు ఇచ్చిన వినతులు తాజా స్థితి నివేదికలు వారికి అందజేశాను.… pic.twitter.com/urDR6gRVNv
— Lokesh Nara (@naralokesh) February 12, 2026