E-Paper
Advertisement

Janasena: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మోదీ కేబినెట్‌ విస్తరణ.. ఈసారి జనసేనకు అవకాశం!

Janasena: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మోదీ కేబినెట్‌ విస్తరణ.. ఈసారి జనసేనకు అవకాశం!
Advertisement

Janasena: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మోదీ కేబినెట్ పునర్ వ్యవస్థీకరించ నున్నారా? ఫిబ్రవరి లేదా మార్చిలో జరిగే అవకాశముందా? ఈసారి ఏపీ నుంచి జనసేనకు అవకాశం ఉందా? ఆ పార్టీ నుంచి రేసులో ఎవరు ఉన్నట్లు? ఇదే చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ హాట్ చర్చ జరుగుతోంది.

మార్చిలోపు మోదీ కేబినెట్‌ విస్తరణ

Advertisement

బుధవారం ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు-హోంమంత్రి అమిత్ షా మద్య రాజకీయాలపై అరగంట పాటు చర్చ జరిగింది. కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈసారి ఏపీ నుంచి ఎవరికి ఛాన్స్ ఇవ్వాలనే దానిపై ఇరువురు నేతల మధ్య మంతనాలు జరిగినట్టు తెలుస్తోంది. ఈసారి జనసేనకు అవకాశం దక్కనున్నట్లు ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రచారం సాగుతోంది.

Advertisement

ఇప్పటికే కేంద్రంలో టీడీపీ కీలక పదవులు తీసుకుంది. మోదీ కేబినెట్ రెండు మంత్రిపదవులు, గవర్నర్ పదవి, అదనపు అడ్వకేట్ జనరల్ వంటి పదవులు దక్కాయి. ఏప్రిల్‌లో బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలు జరిగిన కొద్దిరోజులకు తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికల నగారా మోగనుంది. 

ఈసారి జనసేనకు అవకాశం, రేసులో ఆ నేతలు

ఈ నేపథ్యంలో మోదీ కేబినెట్ విస్తరణకు దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి లేదా మార్చిలో కేంద్ర కేబినెట్ విస్తరణ ఉండే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈసారి ఏపీ నుంచి ఎవరికి అవకాశం వస్తుంది? టీడీపీకి మరో మంత్రి పదవి దక్కనుందా? లేకుంటే జనసేనకు రానుందా? దాదాపుగా జనసేన వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. 

అదే జరిగితే జనసేన నుంచి మంత్రి పదవి రేసులో ఎవరు ఉన్నట్లు అనేదానిపై ఏపీలోని అధికార పార్టీలో చర్చ జరుగుతోంది. తొలుత మోదీ కేబినెట్‌లో జనసేనకు చోటు లభిస్తుందని వార్తలు వచ్చాయి. నాగబాబుకు అవకాశం ఇవ్వవచ్చని ప్రచారం సాగింది. ఈలోగా ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. రేపో మాపో ఆయన్ని కేబినెట్‌లోకి తీసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ALSO READ: టీడీపీ నేత ప్రభాకర్ కిడ్నాప్.. వైసీపీ నేతల హస్తం?

ఈసారి మోదీ కేబినెట్‌లో చోటు దక్కించుకోవాలని ఆలోచన చేస్తోందట జనసేన. ఆ పార్టీకి ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉన్నారు. మచిలీపట్నం నుంచి బాలశౌరి, కాకినాడ ఉదయ్ శ్రీనివాస్ ఉన్నారు. బాలశౌరి గత ఎన్నికల ముందు వైసీపీ వీడి జనసేనలో చేరడం, ఆయన గెలుపొందడం జరిగిపోయింది.  ఈసారి ఆయనకు అవకాశం ఇస్తారా? కాకినాడకు చెందిన శ్రీనివాస్‌కు అవకాశం దక్కనుందా?

ఈ రెండు కాకుండా నాగబాబుని కేంద్ర కేబినెట్‌లోకి పంపిస్తారా? అనేదానిపై ఆ పార్టీ నేతలు తలో విధంగా చర్చించుకుంటున్నారు. ఎటుచూసినా ఈసారి మోదీ కేబినెట్‌లోని జనసేన అడుగుపెట్టడం ఖాయం.  ఆ పార్టీ తరపున కేంద్రమంత్రి పదవి ఎవర్ని వరించనుందో చూడాలి. 

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×