E-Paper
Advertisement

MP Kesineni Nani : కేశినేని మరోసారి సంచలన కామెంట్స్.. బుద్ధా వెంకన్నకే వార్నింగ్ ఇచ్చారా?

MP Kesineni Nani : కేశినేని మరోసారి సంచలన కామెంట్స్.. బుద్ధా వెంకన్నకే వార్నింగ్ ఇచ్చారా?
Advertisement

MP Kesineni Nani : ఎంపీ కేశినేని నాని.. కామెంట్స్ కేశినేని నాని.. విజయవాడలో టీడీపీకి పెద్ద ఎసర్ట్.. కానీ, ఒక్కసారి ఆయన కామెంట్స్ పార్టీలో పెద్ద చర్చకే తెరలేపుతాయి. ఆయన వైసీపీని టార్గెట్ చేసి మాట్లాడుతారా? లేకపోతే సొంతపార్టీలోని నేతలనే టార్గెట్ చేస్తారా? అనే చర్చకు దారి తీస్తాయి. నిన్న కేశినేని చేసిన కామెంట్స్ మరోసారి టాక్ ఆఫ్ విజయవాడ అయ్యాయి. విజయవాడ నుంచి తన కుటుంబం పోటీలో ఉండదని ఆయన తేల్చి చెప్పారు. వెస్ట్ నుంచి తన కుమార్తె పోటీ చేస్తుందన్న ప్రచారాన్ని ఖండించారు.

సంపాదన కోసమే కొంతమంది రాజకీయాల్లోకి రావడం ఫ్యాషన్ గా మారిందని సంచలనవ్యాఖ్యలు చేశారు. తాను ఎంపీగా ఉండకూడదని… టీడీపీ నుంచి వెళ్లిపోవాలని కొందరు అనుకుంటున్నారని ఆయన చెప్పారు. అయితే అలాంటి వారి ఆటలను సాగనివ్వనని కేశినేని వార్నింగ్ ఇచ్చారు. అక్రమ సంపాదనకు తాను వ్యతిరేకమని.. ఎవరైనా దోచుకోవాలని చూసినా వారి భరతం పడతానని గట్టిగా చెప్పారు. కాల్ మనీ , గుడి దగ్గర కొబ్బరిచిప్పలు అమ్ముకునేవారిని వెస్ట్ నియోజకవర్గ ప్రజలు ఆదరించరని అన్నారు. పోటీలో ఉండకపోయినా.. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి ఓ కాపలా కుక్కలా ఉంటానంటూ నాని చేసిన కామెంట్స్ ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి.

Advertisement

నాని కామెంట్స్ ఎవరిని ఉద్దేశించి చేశారా? అని చర్చ నడుస్తోంది. ఓ వైపు చంద్రబాబుని, టీడీపీని ఆకాశమంత ఎత్తును పోల్చుతూనే.. మరోవైపు సొంతపార్టీలోనే కొందరిని కేశినేని టార్గెట్ చేస్తున్నారని అనిపిస్తోంది. కేశినేని తమ్ముడు చిన్ని గత కొంతకాలంగా విజయవాడ పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉంటున్నారు. చిన్ని యాక్టీవ్ అవ్వడం నానికి కాస్త ఇబ్బందికరంగా మారినట్టు ప్రచారం జరుగుతోంది. ఈసారి చిన్ని విజయవాడ ఎంపీగా పోటీ చేస్తారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. విజయవాడ టీడీపీలో గ్రూప్ రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో.. ఆయన సొంతపార్టీలోని ఆయనకు వ్యతిరేకంగా ఉన్నవారినే టార్గెట్ చేసి మాట్లాడారని బెజవాడ సర్కిల్స్ లో కొందరు చర్చించుకుంటున్నారు.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×