BigTV English
Advertisement

YSRCP: ఆనంకు కాకాణి సపోర్ట్.. నేదురుమల్లికి చెక్.. నెల్లూరు వైసీపీలో లొల్లి..

YSRCP: ఆనంకు కాకాణి సపోర్ట్.. నేదురుమల్లికి చెక్.. నెల్లూరు వైసీపీలో లొల్లి..
anam nedurimalli

YSRCP: నెల్లూరు పెద్దారెడ్ల వింత రాజకీయం జిల్లాలో మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. వైసీపీ అధిష్టానం వేటు వేసిన వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డికి.. మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి సాయం చేశారు. పార్టీ అధినేత జగన్ నియమించిన వెంకటగిరి ఇంచార్జ్ నేదురుమల్లి రాంకుమార్ రెడ్డికి షాక్ ఇచ్చారు. మధ్యలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎంటరవడం కూడా హాట్ హాట్‌గా మారింది. ఇందుకు వెంకటగిరి నియోజకవర్గంలోని రాపూరు మండలాధ్యక్షుడి ఎన్నిక వేదికైంది.


నెల్లూరు జిల్లా రాపూరు ఎంపిపి చెన్నుబాలకృష్ణారెడ్డి అనారోగ్యంతో మృతి చెందడంతో కొత్త మండలాధ్యక్షుడి కోసం ఎన్నిక జరిగింది. రాపూరు మండలంలో మొత్తం 12 ఎంపీటీసీలు ఉండగా.. గురువారం ఏ ఒక్కరు ఓటింగ్‌కు రాలేదు. దీంతో ఎన్నిక శుక్రవారానికి వాయిదా పడింది.

12 మంది ఎంపీటీసీల్లో ఆనం వర్గానికి చెందినవారు ఆరుగురు ఉండగా.. మిగతా ఆరుగురు నేదురుమల్లి వర్గీయులుగా ముద్ర పడ్డారు. ఆనంకు ఆత్మీయుడైన చెన్ను బాలకృష్ణారెడ్డి వర్గంలో తొలుత ఐదుగురు మాత్రమే ఉండగా.. నేదురుమల్లి గ్రూపు సభ్యులు ఏడుగురు అయ్యారు. అయితే తనకు ఎంపీపీ పదవి ఇవ్వాలంటూ నేదురుమల్లి వర్గీయుడు పాపకన్ను మధురెడ్డి పట్టుపట్టడంతో రాజకీయం మలుపు తిరిగింది. ఆయన అభ్యర్థిత్వాన్ని కొందరు వ్యతిరేకించారు. ఇదే అదనుగా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి రంగంలోకి దిగారు. జిల్లాకు చెందిన మంత్రి కాకాణి సాయంతో రాజకీయం నడిపించారు. ప్రభుత్వ సలహాదారుడు సజ్జలతో మాట్లాడి ఎట్టకేలకు తమకు సన్నిహితుడు చెన్ను బాలకృష్ణారెడ్డి వర్గానికి అనుకూలంగా వ్యూహం రచించారు. మొత్తానికి.. చెన్ను వర్గానికే చెందిన ప్రసన్న ఎంపీపీగా ఎన్నికయ్యారు.


Related News

Tirupati Laddu Controversy: తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సిట్ దూకుడు.. కీలక నిందితుడు అరెస్ట్

AP Investments: ఏపీకి భారీగా తరలివస్తున్న పెట్టుబడులు.. లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం..

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Big Stories

×