Big Stories

Nara Chandrababu Naidu : మళ్లీ ప్రజాక్షేత్రంలోకి టీడీపీ అధినేత.. రైతులకు భరోసా..

Nara Chandrababu Naidu : ఏపీలో ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు 73 ఏళ్ల వయసులో కూడా ప్రజాక్షేత్రంలో చురుగ్గా తిరుగుతున్నారు. వయసులో ఉన్నవారు తిరగలేని ప్రాంతాలకు వెళుతున్నారు. టీడీపీ అధినేత మళ్లీ జనంలోకి వెళ్లారు. తుపానుతో పంటలు కోల్పోయిన రైతులను పరామర్శించారు.

- Advertisement -

గుంటూరు జిల్లా అమర్తలూరులో చంద్రబాబు పర్యటించారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. అంతకుముందు తెనాలి నియోజకవర్గం నందివెలుగులో పర్యటించారు. తుపాను దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. కాలువల్లో పూడికలు తీయకపోవడం వల్ల రైతులకు ఎక్కువ నష్టం జరిగిందన్నారు. కాలువలు పొంగి పంటలు మునిగిపోయాయని తెలిపారు. ఇది ప్రభుత్వం వైఫల్యమేనని విమర్శించారు.

- Advertisement -

నష్టపోయిన రైతులకు వైసీపీ ప్రభుత్వం పరిహారం ఇవ్వకపోతే.. 3 నెలల తర్వాత తానే ఇస్తానని హామీ ఇచ్చారు. శనివారం పర్చూరు, పత్తిపాడు నియోజకవర్గాల్లో బాబు పర్యటన కొనసాగనుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News