BigTV English

Nara Chandrababu Naidu : మళ్లీ ప్రజాక్షేత్రంలోకి టీడీపీ అధినేత.. రైతులకు భరోసా..

Nara Chandrababu Naidu : మళ్లీ ప్రజాక్షేత్రంలోకి టీడీపీ అధినేత.. రైతులకు భరోసా..

Nara Chandrababu Naidu : ఏపీలో ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు 73 ఏళ్ల వయసులో కూడా ప్రజాక్షేత్రంలో చురుగ్గా తిరుగుతున్నారు. వయసులో ఉన్నవారు తిరగలేని ప్రాంతాలకు వెళుతున్నారు. టీడీపీ అధినేత మళ్లీ జనంలోకి వెళ్లారు. తుపానుతో పంటలు కోల్పోయిన రైతులను పరామర్శించారు.


గుంటూరు జిల్లా అమర్తలూరులో చంద్రబాబు పర్యటించారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. అంతకుముందు తెనాలి నియోజకవర్గం నందివెలుగులో పర్యటించారు. తుపాను దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. కాలువల్లో పూడికలు తీయకపోవడం వల్ల రైతులకు ఎక్కువ నష్టం జరిగిందన్నారు. కాలువలు పొంగి పంటలు మునిగిపోయాయని తెలిపారు. ఇది ప్రభుత్వం వైఫల్యమేనని విమర్శించారు.

నష్టపోయిన రైతులకు వైసీపీ ప్రభుత్వం పరిహారం ఇవ్వకపోతే.. 3 నెలల తర్వాత తానే ఇస్తానని హామీ ఇచ్చారు. శనివారం పర్చూరు, పత్తిపాడు నియోజకవర్గాల్లో బాబు పర్యటన కొనసాగనుంది.


Related News

CM Progress Report: విదేశీ ప్రతినిధులతో సీఎం భారీ పెట్టుబడులే లక్ష్యం!

AP Rains: రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP Elections: నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు.. జనవరిలో నోటిఫికేషన్.. నీలం సాహ్ని ప్రకటన!

Toll Plaza Crowd: అమ‌లులోకి కొత్త రూల్స్‌.. టోల్ ప్లాజాల వద్ద భారీగా రద్దీ!

AP Free Coaching: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?

Jagan Assembly: ఈ మాస్ ర్యాగింగ్ ని జగన్ తట్టుకోగలరా? వైసీపీ వ్యూహం ఏంటి?

Dasara 2025: దసరా సంబరాలకు ముస్తాబైన ఇంద్రకీలాద్రి.. ఈ ఏడాది 11 రోజుల పాటు ఉత్సవాలు

Vijayawada Durga Festival: 10,000 సీసీ కెమెరాలతో.. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులకు భారీ బందోబస్తు

Big Stories

×