E-Paper
Advertisement

Sajjala Ramakrishna: కాకరేపుతున్న సజ్జల తాజా కామెంట్స్.. ఏపీలో మరోసారి..

Sajjala Ramakrishna: కాకరేపుతున్న సజ్జల తాజా కామెంట్స్.. ఏపీలో మరోసారి..
Advertisement

Sajjala Ramakrishna Reddy comments(Political news in AP): ఏపీ ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం కౌంటింగ్ సమయంలో వైసీపీ పోలింగ్ ఏజెంట్లు జాగ్రత్తగా వ్యవహరించాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. అంతే కాకుండా కౌంటింగ్ సమయంలో ప్రత్యర్థుల ఏజెంట్లతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

వైసీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం కౌంటింగ్ ఏజెంట్లకు వర్క్ షాప్ కార్యక్రమం నిర్వహంచారు. ఈ సమావేశానికి సజ్జల హాజరయ్యారు. ఎన్నికల కౌంటింగ్ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని అవతలి పార్టీ ఆటలు సాగనివ్వద్దని తెలిపారు. మరో సారి ఖచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జూన్ 9న జగన్ ప్రమాణ స్వీకారం ఉంటుందని అన్నారు. అందులో ఎటువంటి అనుమానం లేదని తెలిపారు.

Advertisement

ఇదిలా ఉంటే..చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కు మెయిల్ ద్వారా వైసీపీ రిక్వెస్ట్ పంపించింది. వైసీపీ రాజ్య సభ సభ్యులు నిరంజన్ రెడ్డి ఈ మెయిల్ పంపించారు. అయితే పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఈ నెల 25 న ఇచ్చిన నిబంధనలు గతంలో ఇచ్చిన వాటికి విరుద్దంగా ఉన్నాయని తెలిపారు. అటెస్టిండ్ ఆఫీసర్ స్పెసిమెన్ సిగ్నీచర్ తీసుకోవడం ఈసీ నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు.

Also Read: విదేశాల నుంచి వచ్చిన చంద్రబాబు, రేపో మాపో విజయవాడకు..

Advertisement

కొత్త  నిబంధనల వల్ల సరైన ఓట్లు కూడా తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉందని వెల్లడించారు. దీంతో ఎన్నికల నిర్వహణ సమగ్రత దెబ్బతింటుందని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో సమగ్రతను కాపాడేందుకు ఈ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతున్నామని ఎన్నికల కమిషన్ ను కోరారు

Tags

Related News

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

Big Stories

Advertisement
×