E-Paper
Advertisement

China Court: లంచాలు తీసుకునే అధికారులకు ఈ విషయం తెలిస్తే.. ఒంట్లో వణుకు పుట్టడం ఖాయం!

China Court: లంచాలు తీసుకునే అధికారులకు ఈ విషయం తెలిస్తే.. ఒంట్లో వణుకు పుట్టడం ఖాయం!

China Court sentences former banker to death: అవినీతికి పాల్పడే అధికారులపై చైనా ప్రభుత్వం తీవ్ర స్థాయిలో చర్యలు తీసుకుంటుంది. లంచం తీసుకున్న ఓ బ్యాంక్ అధికారికి మరణిశిక్షను విధించింది. చైనా తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రపంచ వ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

చైనాలో అవినీతికి పాల్పడే అధికారులపై అక్కడి ప్రభుత్వం ఉక్కపాదం మోపుతుంది. దోషులుగా తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో భారీ స్థాయిలో లంచాలు తీసుకున్న కేసులో ఓ బ్యాంక్ మాజీ ఆఫీసర్ దోషిగా తేలాడు. అతడిపై వచ్చిన అభియోగాలు నిజమేనని రుజువయ్యాయి. దీంతో అతడికి మరణ శిక్ష విధిస్తూ తూర్పు చైనాలోని ఓ న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. మరో విషయమేమంటే అదే బ్యాంకుకు చెందిన ఓ ఉన్నతాధికారికి కూడా మూడేళ్ల క్రితం ఇదే కోర్టు మరణశిక్షను విధించింది.

చైనా హువారోంగ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ అనేది చైనా హువారోంగ్ అసెట్ మేనేజిమెంట్ ఆఫ్ షోర్ కంపెనీ. ఇందులో బెయ్ తియాన్ హుయ్ అనే వ్యక్తి గతంలో జనరల్ మేనేజర్ గా పని చేశాడు. ఆ సమయంలో ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని అనేక ప్రాజెక్టులకు అక్రమంగా అనుమతులు ఇచ్చారని, ఈ ప్రాజెక్టుల మాటున భారీ స్థాయిలో నగదు చేతులు మారిందని వెల్లడైంది. మొత్తం రూ. 1264 కోట్ల వరకు లంచం రూపంలో ఆయన తీసుకున్నట్లు రుజువు అయ్యింది. ఈ కేసు విషయమై విచారణ చేపట్టిన కోర్టు అతడికి మరణశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. ఈ తీర్పుపై అతను అప్పీల్ కు వెళ్తాడా లేదా అనే విషయంపై స్పష్టత లేదు. కానీ, మరణశిక్ష నుంచి బయటపడడం కష్టమని స్థానికంగా చర్చ నడుస్తోంది.

Also Read: పాక్‌లో దారుణమైన యాక్సిడెంట్, 28 మంది మృతి

చైనా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జిన్ పింగ్ ఆ దేశంలో అవినీతి వ్యతిరేక చర్యలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో చాలామంది అవినీతికి పాల్పడిన అధికారులు పట్టుబడ్డారు. 2021 జనవరి నెలలో ఓ వ్యక్తికి మరణశిక్షను విధించింది. మరుసటి నెలలో అతడికి ఉరిశిక్షను అమలు చేసిన విషయం తెలిసిందే.

Tags

Related News

Big Shock To Trump: ట్రంప్‌కు ఊహించని ఝలక్.. షాకిచ్చిన వార్ పవర్స్, ఆపరేషన్ ‘ఎపిక్ ఫ్యూరీ’ క్లోజ్

Kuwait Airport: ఇరాన్ మిస్సైళ్ల దాడులు.. కువైట్‌ ఎయిర్‌పోర్ట్ డ్యామేజ్, విమాన సర్వీసులు రద్దు

మరో బాంబ్‌ పేల్చిన అమెరికా.. భారత్‌పై అదనపు సుంకాలకు ప్రతిపాదన, ఏకంగా 12 శాతం

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడులు, ఖేష్మ్ ద్వీపంపై

ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. ఇకపై మాటలు-చర్చల్లేవ్, హోర్మూజ్ జలసంధి మాటేంటి?

ఇరాన్‌లో ఇంటిపోరు మొదలైందా? అధ్యక్షుడు మసూద్‌ నిర్ణయం వెనుక, అసలేం జరుగుతోంది?

రూటు మార్చిన అమెరికా.. ఇరాన్‌పై మెరుపు దాడులు, రాడార్- డ్రోన్ వ్యవస్థలు డ్యామేజ్

హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్.. ఇరాన్ సైనిక క్యాంప్‌పై అమెరికా దాడి, కవ్వింపు చర్యలు డీల్ కోసమా?

Big Stories

×