E-Paper
Advertisement

Parthasarathy : వైసీపీలో మరో వికెట్‌ డౌన్.. చంద్రబాబుతో పార్థసారథి భేటీ..

Parthasarathy :వైసీపీలో మరో వికెట్‌ పడబోతోంది. ఎమ్మెల్యే పార్థసారథి పార్టీని వీడబోతున్నారు. హైదరాబాద్‌లో చంద్రబాబును కలిసిన పార్థసారథి… టీడీపీలో చేరే అంశంపై చర్చించారు. ఇటీవల జగన్‌పై పార్థసారథి విమర్శలు చేయడంతో… పార్టీ అధిష్టానం వివరణ కోరింది. మారిన పరిణామాలతో చంద్రబాబును కలిసిన పార్థసారథి… టీడీపీలో చేరేందుకు లైన్‌ క్లియర్ చేసుకున్నారు.

Parthasarathy : వైసీపీలో మరో వికెట్‌ డౌన్.. చంద్రబాబుతో పార్థసారథి భేటీ..

Parthasarathy : వైసీపీలో మరో వికెట్‌ పడబోతోంది. పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి పార్టీని వీడబోతున్నారు. హైదరాబాద్‌లో చంద్రబాబును కలిసిన పార్థసారథి.. టీడీపీలో చేరే అంశంపై చర్చించారు. ఇటీవల జగన్‌పై పార్థసారథి విమర్శలు చేయడంతో.. పార్టీ అధిష్టానం వివరణ కోరింది. మారిన పరిణామాలతో చంద్రబాబును కలిసిన పార్థసారథి.. టీడీపీలో చేరేందుకు లైన్‌ క్లియర్ చేసుకున్నారు.

ఏపీలోని ప్రధాన పార్టీల్లో టికెట్ల గోల ఇలా పీక్స్‌కు చేరింది. అధికార వైసీపీ, విపక్ష టీడీపీ రెండూ కూడా అభ్యర్థులను ఖరారు చేసేందుకు సర్వేలపైనే ఆధారపడ్డాయి. ఇప్పటికే ఇంచార్జ్‌ల మార్పుతో రెండు లిస్ట్‌లను ప్రకటించిన అధికార వైసీపీలో అసంతృప్త జ్వాలలు పీక్స్‌కు చేరాయి. అనేక మంది నేతలు జెండా ఎత్తేసి టీడీపీ పంచన చేరిపోయారు.మరికొందరు చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం మూడో లిస్ట్‌ కోసం నరాలు తెగె ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు నేతలు.

తాడేపల్లి క్యాంప్‌ ఆఫీస్‌ నుంచి పిలుపు వస్తుందంటే చాలు వైసీపీ నేతలు వణికిపోతున్నారు. ఇప్పటికే పార్టీ నుంచి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు వంశీకృష్ణయాదవ్, సి.రామచంద్రయ్య, క్రికెటర్ అంబటి రాయుడు పార్టీని వదిలి వెళ్లిపోయారు. మరోవైపు తన సీటు మారిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదంటున్నారు నర్సరావు పేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. అయితే అదే సీట్ కోసం మచిలీపట్నం ఎంపీ బాలశౌరి పట్టుపడుతున్నారు. ఒకవేళ టికెట్ దక్కకపోతే ఆయన జనసేనలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇలా టిక్కెట్ దక్కదంటే గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్థసారథి పసుపు కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు.

అటు విపక్ష టీడీపీలోనూ సీట్లు ప్రకటించకముందే ప్రకంపనలు మొదలయ్యాయి. ఇప్పటికే తాను పార్టీకి రాజీనామా చేస్తానని ఎంపీ కేశినేని నాని ప్రకటించేశారు. లిస్ట్‌లో తమ పేర్ల కోసం తెలుగు తమ్ముళ్లు ఎదురు చూస్తున్నారు. ఒకవేళ టికెట్ దక్కకపోతే పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారు కొందరు నేతలు.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×