E-Paper
Advertisement

Pawan Kalyan: పవనే సీఎం.. సర్వే ఫలితాల్లో సంచలనం..

Pawan Kalyan: పవనే సీఎం.. సర్వే ఫలితాల్లో సంచలనం..
Advertisement
cm pawan-kalyan

Pawan Kalyan: సీఎం అవుతానంటూ పవన్ చేస్తున్న ప్రకటన ప్రజల్లో జోష్ నింపిందా? పొత్తులు పెట్టుకోకుండా ఒంటరిగా వెళ్లినా జనసేనాని ముఖ్యమంత్రి అవుతారా? కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య మాత్రం అవునంటున్నారు. తమ సంస్థ తరఫున గోదావరి జిల్లాల్లో సర్వే చేశామంటూ ఆ రిపోర్ట్ బయటపెట్టారాయన.

ప్రతి నియోజకవర్గంలో 500 శాంపిల్స్ సేకరించామని.. కులాలవారీగా అభిప్రాయం తెలుసుకున్నామని చెప్తున్నారు. ఆ సర్వేరిపోర్టు ప్రకారం.. జనసేనకు 80శాతం మంది కాపులు మద్దతిస్తున్నారు. టీడీపీ-8, వైసీపీ-12 శాతం కాపుల మద్దతు పొందుతున్నాయి.

Advertisement

బీసీ ఓట్లు విషయానికి వస్తే.. జనసేనకు 25శాతం సపోర్ట్ ఇస్తుండగా.. టీడీపీకి 40 శాతం మంది మద్దతు పలుకుతున్నారు. మిగతా 35 శాతం మంది అధికార వైసీపీకి అండగా ఉంటున్నారు.

ఎస్సీ ఓట్లు.. జనసేన-26, టీడీపీ-14 శాతం పడనుండగా.. వైసీపీకి 60 శాతం మంది మద్దతుగా నిలుస్తున్నట్టు హరిరామ జోగయ్య చేయించిన సర్వేలో తేలింది.

Advertisement

ఈ లెక్కన పవన్‌కు ఫుల్ సపోర్టు ఉందని హరిరామ జోగయ్య మాట. వారాహి యాత్ర పూర్తయ్యి.. పవన్ పథకాలు పూర్తిస్థాయిలో తెలిస్తే.. మరింత మద్దతు పొందగలరని ఆయన అంటున్నారు.

తాను సీఎం అవుతానంటూ, అందుకు అన్ని అర్హతలు సాధించానంటూ పిఠాపురం సభలో పవన్ చేసిన ప్రకటన ప్రజల్లో ఫుల్ జోష్ నింపిందని కూడా జోగయ్య అంటున్నారు.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×