విశాఖను AI, డేటా సెంటర్ హబ్గా మార్చే దిశగా ఏపీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. 6.5 గిగావాట్ల డేటా సెంటర్ ఎకోసిస్టమ్కు ఏటా సుమారు 3 TMC నీరు అవసరమవుతుందని.. అది పోలవరం ఇండస్ట్రియల్ అలొకేషన్ నుంచి ప్రత్యేక పైపుల ద్వారా అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఇక్కడే చాలా ప్రశ్నల్ని కొందరు రెయిజ్ చేస్తున్నారు.
ఇంత భారీ స్థాయిలో నీరు, విద్యుత్, భూమి వినియోగించే ప్రాజెక్టులకు స్థానిక ప్రజల అభిప్రాయాలు ఎంతవరకు తీసుకున్నారు..? ప్రభుత్వం చెబుతున్న దానికంటే ఎక్కువ టీఎంసీలే అవసరమని, డేటా సెంటర్లకు పోలవరం నీరు ఎలా ఇస్తారంటూ సీఎం చంద్రబాబుకు కేంద్ర ఇంధన శాఖ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ బహిరంగ లేఖ రాశారు. సో ఇప్పుడు డేటా సెంటర్లూ అవసరమే. అదే సమయంలో విశాఖకు, అటు ఉత్తరాంధ్ర సాగుకు నీళ్లూ అవసరమే. మరి ఈ బ్యాలెన్స్ ఎలా?