BigTV English

Pawan Kalyan: ఎర్రమట్టి దిబ్బలపై గ్రీన్‌ ట్రైబ్యునల్‌కు వెళ్తాం.. పవన్ పోరుబాట..

Pawan Kalyan: ఎర్రమట్టి దిబ్బలపై గ్రీన్‌ ట్రైబ్యునల్‌కు వెళ్తాం.. పవన్ పోరుబాట..
pawan bheemili

Pawan Kalyan: ఉత్తరాంధ్ర విధ్వంసం, దోపిడీపై జనసేనాని పోరుబాట పట్టారు. ప్రభుత్వ పెద్దల ఆక్రమణలపై ఉద్యమిస్తున్నారు. రిషికొండ, సిరిపురం భూముల తర్వాత భీమిలి ఎర్రమట్టి దిబ్బలను సందర్శించారు పవన్ కల్యాణ్. ఎర్రమట్టి దిబ్బలు అరుదైన వారసత్వ సంపదని.. వాటిని రక్షించుకోవాలని పిలుపు ఇచ్చారు.


1200 ఎకరాల్లో ఉండే ఎర్రమట్టి దిబ్బలు.. ఇప్పుడు కేవలం 292 ఎకరాలకే పరిమితమయ్యాయన్నారు పవన్. తెలంగాణలోనూ ఇలాగే దోచుకున్నారని.. ఇప్పుడు ఏపీపైన పడ్డారని విమర్శించారు. పర్యాటక శాఖ మంత్రి ఆధ్వర్యంలోనే అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. వెంటనే పరిరక్షణ చర్యలు తీసుకోకపోతే.. కేంద్ర పర్యావరణ శాఖ దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు పవన్ కల్యాణ్. అవసరమైతే గ్రీన్‌ ట్రైబ్యునల్‌కు వెళ్తామని చెప్పారు.

జాతీయ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఎర్రమట్టి దిబ్బల ప్రాంతాల్లో బఫర్‌ జోన్‌ ఏర్పాటు చేసి.. రక్షణ కంచె నిర్మించాలని డిమాండ్ చేశారు జనసేనాని.


Related News

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Big Stories

×