BigTV English

Pawan Kalyan: పోలవరం నిర్వాసితులకు పవన్ కళ్యాణ్ భారీ విరాళం

Pawan Kalyan: పోలవరం నిర్వాసితులకు పవన్ కళ్యాణ్ భారీ విరాళం
Advertisement

Pawan Kalyan: ఏపీ సీఎం జగన్‌‌పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శనాస్త్రాలు సంధించారు. పోలవరం ప్రాజెక్టుపై జగన్ కథలు చెబుతున్నారని ఆరోపించారు. పోలవరం నియోజకవర్గం కొయ్యల గూడెం వారాహి విజయభేరి సభలో పాల్లొన్న పవన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా పోలవరం నిర్వాసితులకు ఆయన రూ.కోటి విరాళం ప్రకటించారు.


పోలవరం ప్రాంతానికి కరాటం రాంబాబు కుటుంబం ఎంతో మేలు చేసిందని అన్నారు. తాను పార్టీ పెట్టిన నాటి నుంచి తన భుజం తట్టి ఆయన పోత్సహించారని తెలిపారు. సీఎం రాజశేఖర్ రెడ్డి హయాంలో పోలవరం ప్రాజెక్టు కొంత వరకు పూర్తయిందంటే..అందుకు కారణం కరాటం రాంబాబు కుటుంబం అని అన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం వారు 110 ఎకరాలను ప్రభుత్వానికి ఇచ్చారని గుర్తు చేశారు.

Also Read:ముద్రగడ ఛాలెంజ్, పవన్‌ ఓటమి ఖాయం, లేకపోతే


టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు పనులు 50 శాతం పూర్తయ్యాయని తెలిపారు. జగన్ అధికారంలోకి వచ్చాక పోలవరంపై కథలు చెబుతున్నారని విమర్శించారు. పునరావాస ప్యాకేజీ అమలు చేస్తామని చెప్పి అందరినీ నమ్మించారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు గురించి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రిని అడిగితే నాకేం తెలుసు అంటారు..అందుకేనా మంత్రి పదవి ఇచ్చింది ? డ్యాన్సులు వేయడానికా..అంటూ ఫైర్ అయ్యారు.

Related News

Pithapuram Politics: మంత్రి నారాయణ కామెంట్స్ పై.. ఇన్ డైరెక్ట్‌గా స్పందించిన వర్మ..

Lokesh In Kurnool: గ్యాప్ రాకూడదు, మళ్లీ మనమే రావాలి – లోకేష్

Modi Kurnool: బాబు-పవన్ రూపంలో ఏపీలో శక్తిమంతమైన నాయకత్వం ఉంది -కర్నూలు సభలో మోదీ

Pawan Kalyan:15 ఏళ్లు మనదే అధికారం.. హై ఓల్టేజ్ స్పీచ్

CM Chandrababu: ప్రధాని మోదీ తెచ్చిన సంస్కరణలు దేశానికి గేమ్ ఛేంజర్లు: సీఎం చంద్రబాబు

CM Chandrababu: లండన్ టూర్‌కి సీఎం చంద్రబాబు.. షెడ్యూల్ ఖరారు, ఎప్పుడంటే..

PM Modi: మల్లన్నసేవలో ప్రధాని మోడీ.. సీఎం చంద్రబాబు, డీసీఎం పవన్‌తో కలిసి శ్రీశైలంలో పర్యటన

Narayana Nadendla: అలా మాట్లాడటం సరికాదు.. నారాయణపై నాదెండ్ల సీరియస్

Big Stories

×