E-Paper
Advertisement

Pawan Kalyan: మీ సేవలు అమోఘం.. తెలుగు ఐఏఎస్‌ కృష్ణతేజపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసలు

Pawan Kalyan: మీ సేవలు అమోఘం.. తెలుగు ఐఏఎస్‌ కృష్ణతేజపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసలు

Pawan Kalyan Congrats to IAS Krishna Teja: తెలుగు ఐఏఎస్ కృష్ణతేజకు ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. జాతీయ బాలల రక్షణ కమిషన్ పురస్కారానికి ఎంపిక కావడం హర్షణీయమని ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కేరళలో త్రిసూర్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తూ ప్రజా సంక్షేమం, పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని కొనియాడారు.

సేవలు ఎనలేనివి..

కృష్ణతేజ సేవలు అమోఘమని, ఉద్యోగులు, యువతకు స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. బాలల హక్కుల పరిరక్షణకు ఉత్తమ విధానాలు అనుసరించారన్నారు. కరోనా, కేరళ వరదల విపత్తు సమయాల్లో ఆయన అందించిన సేవలు మరచిపోలేనివన్నారు. బాలల పరిరక్షణలో త్రిస్సూర్ జిల్లా దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచిందని, దీని వెనక ఆయన కృషి ఎంతో దాగి ఉందని పవన్ కల్యాణ్ కొనియాడారు.

Also Read: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ‘స్పందన’లో మార్పులకు శ్రీకారం

పల్నాడు జిల్లా వాసి

కృష్ణతేజ సేవలు అమోఘమని, ఉద్యోగులు, యువతకు స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. బాలల హక్కుల పరిరక్షణకు ఉత్తమ విధానాలు అనుసరించారన్నారు. కరోనా, కేరళ వరదల విపత్తు సమయాల్లో ఆయన అందించిన సేవలు మరచిపోలేనివన్నారు. బాలల పరిరక్షణలో త్రిస్సూర్ జిల్లా దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచిందని, దీని వెనక ఆయన కృషి ఎంతో దాగి ఉందని పవన్ కల్యాణ్ కొనియాడారు.

పల్నాడు జిల్లా వాసి

ఐఏఎస్ కృష్ణతేజ ఏపీకి చెందిన వ్యక్తి కావడం గర్వంగా ఉందని పవన్ అన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన ఆయన 27న ఢిల్లీలో జాతీయ పురస్కారం అందుకోనున్నారు. 2015 బ్యాచ్ ఐఏఎస్ అయిన కృష్ణతేజ 2023 మార్చిలో కేరళ రాష్ట్రం త్రిసూర్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు.

కరోనా సమయంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన 609 మంది విద్యార్థులను గుర్తించి ఆదుకున్నారు. దాతల సహకారంతో వీరందరికీ ఉన్నత చదువులు అందేలా భరోసా కల్పించారు. అదే విధంగా కరోనా కారణంగా భర్త చనిపోయి కుటుంబం చిన్నాభిన్నం కావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వితంతువులు ఇళ్లు నిర్మించేలా ప్రత్యేక చొరవ తీసుకున్నారు.

అదే విధంగా మరో 150మందికి పైగా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించారన్నారు. ఆయన అంకితభావాన్ని కేరళ ప్రజలు మరచిపోలేరని పవన్ కల్యాణ్ అన్నారు.

Tags

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×