E-Paper
Advertisement

Pawan Kalyan: మీ సేవలు అమోఘం.. తెలుగు ఐఏఎస్‌ కృష్ణతేజపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసలు

Pawan Kalyan: మీ సేవలు అమోఘం.. తెలుగు ఐఏఎస్‌ కృష్ణతేజపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసలు
Advertisement

Pawan Kalyan Congrats to IAS Krishna Teja: తెలుగు ఐఏఎస్ కృష్ణతేజకు ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. జాతీయ బాలల రక్షణ కమిషన్ పురస్కారానికి ఎంపిక కావడం హర్షణీయమని ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కేరళలో త్రిసూర్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తూ ప్రజా సంక్షేమం, పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని కొనియాడారు.

సేవలు ఎనలేనివి..

Advertisement

కృష్ణతేజ సేవలు అమోఘమని, ఉద్యోగులు, యువతకు స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. బాలల హక్కుల పరిరక్షణకు ఉత్తమ విధానాలు అనుసరించారన్నారు. కరోనా, కేరళ వరదల విపత్తు సమయాల్లో ఆయన అందించిన సేవలు మరచిపోలేనివన్నారు. బాలల పరిరక్షణలో త్రిస్సూర్ జిల్లా దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచిందని, దీని వెనక ఆయన కృషి ఎంతో దాగి ఉందని పవన్ కల్యాణ్ కొనియాడారు.

Also Read: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ‘స్పందన’లో మార్పులకు శ్రీకారం

Advertisement

పల్నాడు జిల్లా వాసి

కృష్ణతేజ సేవలు అమోఘమని, ఉద్యోగులు, యువతకు స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. బాలల హక్కుల పరిరక్షణకు ఉత్తమ విధానాలు అనుసరించారన్నారు. కరోనా, కేరళ వరదల విపత్తు సమయాల్లో ఆయన అందించిన సేవలు మరచిపోలేనివన్నారు. బాలల పరిరక్షణలో త్రిస్సూర్ జిల్లా దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచిందని, దీని వెనక ఆయన కృషి ఎంతో దాగి ఉందని పవన్ కల్యాణ్ కొనియాడారు.

పల్నాడు జిల్లా వాసి

ఐఏఎస్ కృష్ణతేజ ఏపీకి చెందిన వ్యక్తి కావడం గర్వంగా ఉందని పవన్ అన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన ఆయన 27న ఢిల్లీలో జాతీయ పురస్కారం అందుకోనున్నారు. 2015 బ్యాచ్ ఐఏఎస్ అయిన కృష్ణతేజ 2023 మార్చిలో కేరళ రాష్ట్రం త్రిసూర్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు.

కరోనా సమయంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన 609 మంది విద్యార్థులను గుర్తించి ఆదుకున్నారు. దాతల సహకారంతో వీరందరికీ ఉన్నత చదువులు అందేలా భరోసా కల్పించారు. అదే విధంగా కరోనా కారణంగా భర్త చనిపోయి కుటుంబం చిన్నాభిన్నం కావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వితంతువులు ఇళ్లు నిర్మించేలా ప్రత్యేక చొరవ తీసుకున్నారు.

అదే విధంగా మరో 150మందికి పైగా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించారన్నారు. ఆయన అంకితభావాన్ని కేరళ ప్రజలు మరచిపోలేరని పవన్ కల్యాణ్ అన్నారు.

Tags

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×