E-Paper
Advertisement

APSRTC: ఏపీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం.. రాష్ట్రంలో పాత బస్సులకు గుడ్ బై.. ఇక అన్ని ఈవీ బస్సులే

APSRTC: ఏపీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం.. రాష్ట్రంలో పాత బస్సులకు గుడ్ బై.. ఇక అన్ని ఈవీ బస్సులే
Advertisement

APSRTC: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఆర్టీసీ బస్సులన్నీ ఎలక్ట్రిక్ వెహికిల్ గా మార్చాలనే ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. పూర్తిస్థాయి రోడ్‌మ్యాప్‌ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. నాలుగేళ్లలో మొత్తం బస్సులను మార్చాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత బస్సుల స్థితిపై నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది.

ఎలక్ట్రిక్ వెహికల్ బస్సులను తీసుకురావడం పై ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. కాలుష్యాన్ని తగ్గించడం, నిర్వహణ ఖర్చులను ఆదా చేయడం, ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలను అందించడం ఈ నిర్ణయం ముఖ్య ఉద్దేశాలు. ఈ క్రమంలోనే లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక పూర్తిస్థాయి రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. ఏపీఎస్‌ఆర్టీఎస్ 11వేలకు పైగా బస్సులను 2029 నాటికి పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాబోయే నాలుగేళ్లలో ప్రస్తుతం ఉన్న బస్సులను ఈవీలుగా మార్చే ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియను దశలవారీగా అమలు చేయడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మొదటి దశలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అమరావతి వంటి ప్రధాన నగరాల్లోని ఎలక్ట్రిక్ వెహికల్ బస్సులను తీసుకురావడం అధికారులు ఫోకస్ పెట్టారు.

Advertisement

ALSO READ: Donald Trump: 8 యుద్ధాలు ఆపిన నాకు నోబెల్ ఇవ్వరా? పాపం, ట్రంప్ మామ బాగా హర్ట్ అయ్యాడు కాబోలు

ఈవీల మార్పు ప్రక్రియకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేయడానికి ప్రస్తుత బస్సుల స్థితిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అంటే ఎంతకాలం బస్సులు సర్వీసులో ఉన్నాయి..? అవ్వి ఎంతకాలం నడుస్తాయి..? అనే వివరాలను అంచనా వేస్తారు. 2029 నాటికి సుమారు 5,731 పాత సిటీ ఆర్డినరీ బస్సులను పక్కన పెట్టాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. వాటి స్థానంలో ఎలక్ట్రిక్ వెహికిల్స్ ను తీసుకురానున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ఇకపై ఆర్టీసీ సముదాయంలోకి కొత్తగా చేర్చే అన్ని బస్సులు ఎలక్ట్రిక్ ఏసీ బస్సులే తీసుకురావాలని అధికారులు తెలిపారు. కొన్ని పాత డీజిల్ బస్సులను ఈవీలుగా మార్చే అవకాశాలను కూడా పరిశీలించాలని ఆదేశించారు. ఎలక్ట్రిక్ బస్సులను విజయవంతంగా నిర్వహించడానికి ఛార్జింగ్ మౌలిక వసతులు కల్పించడం ఒక ముఖ్యమైన అంశమని చెప్పారు.

Advertisement

ALSO READ: CDAC POSTS: సీడ్యాక్‌లో ఉద్యోగాలు.. తెలంగాణలోనూ భారీగా వెకెన్సీలు, ఈ అర్హత ఉంటే చాలు..!

APSRTC డిపోలు, బస్ టెర్మినల్స్, ప్రధాన బస్ స్టాప్‌లలో ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం ‘PM e-Bus Sewa’ పథకం కింద కూడా ఆంధ్రప్రదేశ్‌లోని 11 నగరాలకు 1,050 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించింది. ఇవి పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) మోడల్ ద్వారా రానున్నాయి. మొదటి దశలో 750 బస్సులు రానున్నాయి. ఈవీ బస్సుల నిర్వహణకు ప్రత్యేకంగా డ్రైవర్లు, మెకానిక్‌లు, నిర్వహణ సిబ్బందికి నైపుణ్య శిక్షణ అందించాలని కూడా నిర్ణయించారు.ఈ చర్యలన్నీ రాష్ట్రంలో సుస్థిర రవాణా లక్ష్యాన్ని చేరుకోవడంలోనూ.. డీజిల్ ఖర్చులను తగ్గించడంలో.. కాలుష్య రహిత వాతావరణాన్ని ప్రోత్సహించడంలో ఆర్టీసీకి సహాయపడతాయి.

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×