E-Paper
Advertisement

Perni Nani: అధికారంలోకి రాగానే నేనంటే ఏంటో చూపిస్తా.. పోలీస్ స్టేషన్ లో పేర్ని నాని రచ్చ రచ్చ

Perni Nani: అధికారంలోకి రాగానే నేనంటే ఏంటో చూపిస్తా.. పోలీస్ స్టేషన్ లో పేర్ని నాని రచ్చ రచ్చ
Advertisement

Perni Nani: ‘అధికారంలోకి రాగానే నేనంటే ఏంటో ఏపీ పోలీసులకు చూపిస్తా’ అని మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. మచిలీపట్నం పోలీస్ స్టేషన్‌లో సీఐతో పేర్ని నాని వాగ్వివాదానికి దిగారు. ఇటీవల మచిలీపట్నం మెడికల్ కాలేజీ వద్ద పేర్ని నాని ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు ఆందోళన చేయాయి. పోలీసుల అనుమతి లేకుండా నిరసనలో పాల్గొన్నారని పేర్ని నానితో సహా 400 మందికి 41A నోటీసులు ఇచ్చారు.

 పేర్ని నాని వర్సెస్ సీఐ

పోలీసుల ఇచ్చిన నోటీసులకు సమాధానం ఇవ్వొద్దని వైసీపీ వాట్సాప్ గ్రూపులో మచిలీపట్నం నగర వైసీపీ అధ్యక్షుడు మేకల సుబ్బన్న మెసేజ్ పెట్టారు. ఈ కేసు విచారణలో భాగంగా సుబ్బన్నను పోలీసులు స్టేషన్‌కు పిలిపించించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి పేర్నినాని, తన మద్దతుదారులు, వైసీపీ కార్యకర్తలతో ఆర్ పేట పోలీస్ స్టేషన్‌కు చేరుకుని హంగామా చేశారు.

Advertisement

సీఐతో పేర్ని నాని వాగ్వాదానికి దిగారు. సీఐపై దురుసుగా ప్రవర్తించారు. అధికారంలోకి వచ్చాక మేమేంటో చూపిస్తామన్నారు. పోలీస్ స్టేషన్‌లో పేర్ని నాని చర్యలతో విసిగిపోయిన పోలీసులు స్టేషన్ నుండి వెళ్లిపోవాల్సిందిగా కోరారు. అనంతరం ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Advertisement

Also Read: Delhi Crime News: జోద్‌పూర్‌లో ప్రేమ.. ఢిల్లీలో ముగింపు, వెనుక జరిగింది అదే? 

వైసీపీ నేతలపై కేసులు

సెప్టెంబర్ 19న మచిలీపట్నం ప్రభుత్వ మెడికల్ కాలేజీ భూముల వద్ద వైసీపీ ఆధ్వర్యంలో ‘చలో మెడికల్ కాలేజీ’ నిరసన కార్యక్రమం చేపట్టారు. పోలీసులు నిరసన కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేదు. మాజీ మంత్రి పేర్ని నాని, అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌తో పాటు పలువురు వైసీపీ నేతలు మెడికల్ కాలేజీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేకుండా నిరసన కార్యక్రమం చేపట్టడం, పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో మచిలీపట్నం పోలీసులు వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశారు.

పేర్ని నానిపై ఎస్పీ సీరియస్

మాజీ మంత్రి పేర్ని నానిపై కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేర్ని నాని ఆర్‌.పేట సీఐ విధులకు ఆటంకం కలిగించారన్నారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. మెడికల్ కాలేజీ దగ్గర నిరసన కేసులో.. కొందరికి నోటీసులు ఇచ్చి విచారణ జరుపుతున్నామని ఎస్పీ తెలిపారు. సుబ్బన్నను విచారిస్తున్న సమయంలో పేర్నినాని గ్రూపుగా పీఎస్‌కు వచ్చి వాగ్వాదానికి దిగారన్నారు.

 

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×