E-Paper
Advertisement

PM Modi: మల్లన్నసేవలో ప్రధాని మోడీ.. సీఎం చంద్రబాబు, డీసీఎం పవన్‌తో కలిసి శ్రీశైలంలో పర్యటన

PM Modi: మల్లన్నసేవలో ప్రధాని మోడీ.. సీఎం చంద్రబాబు, డీసీఎం పవన్‌తో కలిసి శ్రీశైలంలో పర్యటన

PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో ఉన్న శ్రీశైల మల్లన్న ఆలయాన్ని సందర్శించారు.. తర్వాత శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పూజలు, దర్శనాలు నిర్వహించారు. అయితే శ్రీశైలం ఆలయం భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటి, 52 శక్తి పీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ జ్యోతిర్లింగం, శక్తి పీఠం ఒకే ఆలయ ప్రాంగణంలో ఉండటం విశేషం, ఇది దేశంలోనే ఏకైకమైనది అని చెప్పుకోచ్చారు.

ప్రధాని మోదీ శ్రీశైలం చేరుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆయనతో కలిసి ఉన్నారు. ముఖ్యమంత్రి నాయుడు రాష్ట్ర ప్రజల తరపున మోదీని స్వాగతించారు. ఉదయం 11:45 నిమిషాలకు మోదీ ఆలయంలోకి ప్రవేశించారు. ఆ తర్వాత దాదాపు దర్శణం 30 నుంచి 45 నిమిషాలపాటు సాగింది.

ఆలయంలో మోదీ మల్లికార్జున స్వామికి పంచామృతాలతో రుద్రాభిషేకం నిర్వహించారు. అలాగే భ్రమరాంబ దేవికి ఖడ్గమాల, కుంకుమార్చన పూజలు చేశారు. ఈ పూజలు హిందూ సంప్రదాయాల ప్రకారం జరిగాయి.. ఆ తర్వాత ప్రధాని ఆలయంలో దర్శనం చేసుకుని ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ముఖ్యంగా ఈ రోజు అక్టోబర్ 16 ఆంధ్ర ప్రదేశ్ లో శ్రీశైల ఆలయాన్ని దర్శించుకున్న నాలుగవ ప్రధానిగా.. ప్రధాని నరేంద్ర మోదీ నిలిచారు..

అలాగే, మోదీ శ్రీ శివాజీ స్పూర్తి కేంద్రాన్ని సందర్శించారు. ఇది శ్రీశైలంలో ఉన్న ఒక స్మారక సముదాయం, ఇందులో ధ్యాన మందిరం, నాలుగు ఐకానిక్ కోటల మోడల్స్ మధ్యలో ఛత్రపతి శివాజీ మహారాజ్ ధ్యానంలో ఉన్న విగ్రహం ఉన్నాయి. ఈ కేంద్రం శ్రీ శివాజీ మెమోరియల్ కమిటీచే నిర్వహించబడుతుంది, మరియు ఇది 1677లో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆలయాన్ని సందర్శించిన జ్ఞాపకార్థం స్థాపించబడింది.

Also Read: మీనాక్షి నటరాజన్ దగ్గరకు కొండా సురేఖ.. 

ఈ సందర్శనకు ముందు మోదీ ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో అనేక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడానికి వచ్చారు. ఆలయ దర్శనం తర్వాత, ఆయన కర్నూలులో రూ. 13,430 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, పునాది రాళ్లు వేశారు. ఇవి పారిశ్రామిక, విద్యుత్, రోడ్లు, రైల్వే, రక్షణ తయారీ, పెట్రోలియం, సహజ వాయువు రంగాలకు సంబంధించినవి. అనంతరం ఆయన ఒక ప్రజా సభలో ప్రసంగించారు.

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×