E-Paper

Pawan Health: పవన్‌కు ప్రధాని మోదీ ఫోన్.. ఆరోగ్యంపై ఆరా, పవన్ కోలుకోవాలని జగన్ ట్వీట్

Pawan Health: పవన్‌కు ప్రధాని మోదీ ఫోన్.. ఆరోగ్యంపై ఆరా, పవన్ కోలుకోవాలని జగన్ ట్వీట్
Advertisement

Pawan Kalyan Health: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర‌మోదీ ఆరా తీశారు. అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలుసుకున్న ప్రధాని, నేరుగా ఫోన్ చేసి పరామర్శించారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ప్రధాని ట్వీట్ చేశారు.

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ప్రధాని మోదీ ఫోన్

Advertisement

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. ఆయన గురించి తెలుసుకున్న ప్రధాని నరేంద్రమోదీ, ఆయనకు ఆదివారం ఉదయం ఫోన్ ఫోన్ చేశారు. శ్వాస కోస సమస్య కారణంగా ఆపరేషన్ చేయించుకున్న పవన్‌ను ప్రధాని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని పవన్‌ను ఆకాంక్షించారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ స్వయంగా ఎక్స్ వేదికగా తెలిపారు.

పవన్ ఆరోగ్యం గురించి ఆరా..  వేగంగా కోలుకోవాలని ఆకాంక్ష

Advertisement

శుక్రవారం ఉదయం వివిధ అంశాలపై అధికారులతో చర్చిస్తున్న సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొద్దినెలలుగా ఆరోగ్యపరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే పవన్ వ్యక్తిగత వైద్యులు పరీక్షించారు. వారి సలహాతో శుక్రవారం అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు.

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి వెళ్లారు. వైద్య బృందం పవన్‌ను పరీక్షించిన ఆపరేషన్ నిర్వహించారు. కోలుకోవడానికి వారం నుంచి పది రోజులపాటు విశ్రాంతి అవసరమని తెలిపారు.  ఆ తర్వాత అధికారిక కార్యక్రమాలలో పాల్గొనవచ్చని తెలిపారు వైద్యులు. దీర్ఘకాలం జాగ్రత్తలు తీసుకోవాలని తగిన సమయం పడుతుందంటూ జనసేన పార్టీ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ వెల్లడించారు.

ALSO READ: ఏలూరు ఇండియన్ బ్యాంకుపై సీబీఐ మెరుపు దాడి.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన ముగ్గురు అధికారులు!

కొన్నాళ్లుగా పవన్‌కల్యాణ్ సైనసైటిస్‌‌తో ఎక్కువగా ఇబ్బంది పడుతుండటంతో ముక్కుకు ఆపరేషన్‌ చేసినట్లు సమాచారం. పవన్‌కు సర్జరీ విజయవంతం కావడంతో ఆ పార్టీ కార్యకర్తలు, మెగా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రధాని మోదీతోపాటు కేంద్ర మంత్రులు, సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, మాజీ సీఎం జగన్ పలువురు రాజకీయ నేతలు పవన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

 

Related News

దేశంలో తొలిసారి.. విశాఖ టు భోగాపురం ఎయిర్‌పోర్టు, ఎయిర్ ట్రావెలర్ల కోసం ప్రత్యేకంగా లాంజ్‌లు

అసలెవరీ సాయికృష్ణ.. బతికున్నాడా? బలయ్యాడా? ఏపీలో క్షణక్షణం ఉత్కంఠ!

వైసీపీ నేతల చుట్టూ కేసుల ఉచ్చు.. ఇకపై కొడాలి నాని వంతు, విచారణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

కూటమి ప్రభుత్వంపై వైవీ సుబ్బారెడ్డి గరంగరం.. అనకొండల మాటేంటి? డైవర్ట్ కోసమేనా?

ఏపీలో అన్నదాతలకు శుభవార్త.. శనివారం అకౌంట్‌లో రూ.7వేలు, ఖాతా ఒక్కసారి చెక్ చేసుకోండి

ప్రైవేటు ట్రావెల్ బస్సులో మంటలు.. స్పాట్‌లో 35 మంది, అనకాపల్లి జిల్లాలో ఘటన

Saikrishna Case: గాదె సాయికృష్ణ కేసుపై సీబీఐ విచారణ జరగాలని.. వైఎస్ జగన్ డిమాండ్..!

హైదరాబాద్ భూకబ్జా కేసు.. వైసీపీ నేత బొల్లా ఆన్సర్లకు.. పోలీసులకే మైండ్ బ్లాక్!

Big Stories

×