Train Derailment: ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం (జనవరి 30) తెల్లవారుజామున ఒక గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో విజయవాడ – చెన్నై ప్రధాన రైలు మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ప్రమాదంలో రైలుకు చెందిన రెండు బోగీలు పక్కనే ఉన్న రెండు రైల్వే లైన్లపై పడిపోవడంతో ట్రాక్ దెబ్బతిన్నది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.
ప్రమాద వార్త తెలిసిన వెంటనే రైల్వే ఉన్నతాధికారులు మరియు సాంకేతిక సిబ్బంది భారీ క్రేన్లతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పట్టాలపై పడిపోయిన బోగీలను తొలగించి, దెబ్బతిన్న ట్రాక్కు మరమ్మతులు చేసే పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టారు. అయితే, పునరుద్ధరణ పనుల కారణంగా పలు ఎక్స్ప్రెస్ మరియు ప్యాసింజర్ రైళ్లు వివిధ స్టేషన్లలో నిలిచిపోయాయి, మరికొన్ని రైళ్లను అధికారులు దారి మళ్లించారు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చి, ట్రాక్ భద్రతను నిర్ధారించిన తర్వాతే రైళ్ల రాకపోకలను పునరుద్ధరిస్తామని అధికారులు స్పష్టం చేశారు.
Read Also: Phone Tapping Case: మరోసారి కేసీఆర్కు సిట్ నోటీసులు! విచారణ హైదరాబాద్లో, కోర్టుకి వెళ్లేందుకు?