BigTV English

Droupadi Murmu : తిరుమల శ్రీవారి సేవలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము..

Droupadi Murmu : తిరుమల శ్రీవారి సేవలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము..

Droupadi Murmu : తిరుమల శ్రీవారిని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దర్శించుకున్నారు. ఆదివారం రాత్రి తిరుమలలోని పద్మావతి అతిథిగృహంలో బస చేసిన రాష్ట్రపతి.. సోమవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం ఎదుట రాష్ట్రపతికి టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి, అర్చకులు స్వాగతం పలికారు. తొలుత వరాహ స్వామిని.. అనంతరం శ్రీవారిని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దర్శించుకున్నారు. ఆ తర్వాత రంగనాయకుల మండపంలో ద్రౌపదీ ముర్ముకు అర్చకులు వేదాశీర్వచనం పలికారు.


తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి శ్రీవారి చిత్రపటం, స్వామివారి తీర్థప్రసాదాలను రాష్ట్రపతికి అందజేశారు. రాష్ట్రపతితోపాటు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఏపీ మంత్రులు నారాయణస్వామి, ఆర్కే రోజా, కొట్టు సత్యనారాయణ శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని విద్యార్థులతో రాష్ట్రపతి భేటీ ఉంది. తిరుపతిలో కార్యక్రమాలు ముగిసిన తర్వాత రాష్ట్రపతి డిల్లీకి పయనమవుతారు.

ఆంధ్రప్రదేశ్‌లో రెండురోజుల పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం విశాఖపట్నంలో నిర్వహించిన నేవీ డేకి హాజరయ్యారు. మరోవైపు ఈ నెల 28న శీతాకాల విడిది కోసం తెలంగాణకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వస్తారు.


Related News

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Big Stories

×