E-Paper
Advertisement

Vijayawada: విజయవాడలో మోదీ రోడ్ షో.. ఒకే వేదికపై మోదీ, చంద్రబాబు, పవన్

Vijayawada: విజయవాడలో మోదీ రోడ్ షో.. ఒకే వేదికపై మోదీ, చంద్రబాబు, పవన్

Modi Roadshow in Vijayawada(AP elections news): విజయవాడలో ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోలో ప్రధానితో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. కూటమి రోడ్ షో కు ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. వేలాదిగా తరలివచ్చిన జనం రోడ్ షోలో పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి భారీగా కార్యకర్తలు తరలివచ్చారు.

ఏపీలో కూటమి గెలుపే లక్ష్యంగా మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి ఇంకా మూడు రోజుల సమయమే ఉండటంతో బరిలో నిలిచిన అభ్యర్థుల తరపున పార్టీల అధినేతలు, ముఖ్యనేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఏపీలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ కూటమి తరపున రంగంలో దిగిన మోదీ విజయవాడలో  రోడ్ షో నిర్వహించారు.

Also Read: బిగ్ టీవీ ప్రీ-పోల్ సర్వే.. ఏపీ ఎన్నికల్లో గెలుపు ఆ పార్టీదే..

ఇందిరా గాంధీ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు మోదీ రోడ్ షో కొనసాగింది. 1.5 కిలో మీటర్ల మేర కొనసాగిన ఈ రోడ్ షోలో మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. 5 వేల మంది పోలీసులతో  అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రోడ్ షో కోసం నగరంలో అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో పాటు ప్రతి 50 మీటర్లకు ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేశారు.

 

 

Tags

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×