E-Paper
Advertisement

Proddutur Prajagalam : ట్రెండు మారింది.. వైసీపీ బెండు తీస్తారు : చంద్రబాబు

Proddutur Prajagalam : ట్రెండు మారింది.. వైసీపీ బెండు తీస్తారు : చంద్రబాబు
Advertisement

Chandrababu Speech in Proddutur

Chandrababu Speech in Proddutur(AP political news) : మే 13న జరిగే ఎన్నికల్లో సైకో ఇంటికెళ్లడం, సైకిల్ అధికారంలోకి రావడం ఖాయమని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం కడప జిల్లా ప్రొద్దుటూరులో నిర్వహించిన ప్రజాగళం ప్రచారసభలో ఆయన మాట్లాడుతూ.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. వైసీపీ అధికారంలో ఉన్న ఈ ఐదళ్లలో రాయలసీమకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ ను ఆయన కరకట్ట కమల్‌హాసన్ గా అభివర్ణించారు. జగన్ కు నీళ్ల విలువ తెలీదని, శ్రీశైలం ఎక్కడుందో కూడా అతనికి ఐడియా లేదని ఎద్దేవా చేశారు. రాయలసీమకు నీళ్లిస్తే.. కోనసీమకంటే అందంగా తయారవుతుందన్నారు.

Advertisement

Also Read : పొలిటికల్ కెరీర్‌లో తొలిసారి.. వెనుక ఏం జరిగింది?

జగన్ కు ఏమీ తెలియకపోయినా.. అన్నీ తెలిసినట్లు నటిస్తాడన్నారు. జగన్ అధికారంలో ఉండగానే పరిశ్రమలు పారిపోయాయని, అదీ అతని బ్రాండ్ అని విమర్శించారు. “ఇప్పుడు ట్రెండ్ మారింది.. ప్రజలు వైసీపీ బెండు తీస్తారు” అని పేర్కొన్నారు. ప్రజల జీవితాలతో జగన్ మందు వ్యాపారం చేస్తుంటే.. వైసీపీ నేతలు గంజాయి అమ్మేవాళ్ల వద్ద డబ్బులు వసూలు చేసి వ్యాపారానికి సహకరిస్తున్నారని ఆరోపించారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే.. గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని తెలిపారు. అలాగే రాయలసీమను రతనాల సీమగా మార్చి.. రైతును రాజు చేయడమే తన సంకల్పమని తెలిపారు.

Advertisement

జగన్ కు రాయలసీమ అంటే హత్యా రాజకీయాలు మాత్రమేనని దుయ్యబట్టిన చంద్రబాబు.. టిడిపికి రాయలసీమ అంటే అభివృద్ధి అని తెలిపారు. ఉద్యోగాలు రావాలంటే చేయాల్సింది ప్రారంభోత్సవాలని, జగన్ కు ఇంతవరకూ శంకుస్థాపనలు చేయడానికే సరిపోయిందని విమర్శించారు. రాయలసీమకు తాము అధికారంలో ఉండగా కియా మోటార్స్ ను తీసుకురాగా.. ఇక్కడ తయారైన 12 లక్షల కార్లు ప్రపంచంలో పరిగెడుతున్నాయన్నారు. క్విట్ జగన్.. సేవ్ రాయలసీమ నినాదంతో.. సైకో పాలనకు చరమగీతం పాడాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు.

Related News

రూ.1000 కోట్ల ఆస్తి.. వేలాది కుటుంబాల ఇళ్ల కల నెరవేర్చిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Big Stories

Advertisement
×